నేడు నెల్లూరు

Friday, April 30, 2010

నగర కాంగ్రెస్‌లో దుమారం

గత అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో కాం గ్రెస్ వర్గపోరు నివ్వురుకప్పిన నిప్పులా లోలోపల నాయకుల మధ్యే రగులు తూ వచ్చింది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేదురుమల్లి జనరల్ స్థానంగా మారిన నెల్లూరు టికెట్‌ను ఆశించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మిలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగించగా, చివ రికి మేకపాటినే నెల్లూరు పార్లమెంట్ టికెట్ వరించింది. అసెంబ్లీ టికెట్ల పంపిణీలో కూడా నేదురుమల్లికి కొంత చుక్కెదురై అసెంబ్లీ స్థానాల్లో నేదురు మల్లి అనుచరులకు టికెట్లు లభించ లేదు. ముఖ్యంగా గూడూరు టికెట్ తనను కాదని పనబాక కృష్ణయ్య తె చ్చుకోవడం నేదురుమల్లి జీర్ణించు కోలేకపోయారు. ఎన్నికల్లో బహిరం గంగా పన బాకను ఓడించాంటూ ప్రచారం చేశారని, ఎన్నికల అనంతరం పార్టీకి ఫిర్యాదులు వెళ్లాయి.

కాంగ్రెస్ అభ్యర్థి పనబాక కృష్ణయ్య పీసీసీ అ«ధ్యక్షుడు డి.శ్రీనివాస్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలకు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు. నేదురుమల్లి సీడబ్ల్యూసీ మెంబరు కావడంతో తన పరిధిలో లేదని పీసీసీ అధ్యక్షుడు తెలపడంతో పార్టీ అధ్యక్షు రాలు సోనియాగాంధీకి నివేదికలు ఇచ్చారు. దీనిపై విచారణ జరపా లంటూ సోనియాగాంధీ పార్టీ నాయ కులను ఆదేశించారు. ఇక అప్పటి నుంచి జిల్లాలో వర్గపోరు తీవ్రమైంది. ఆనం సోదరులు, నేదురుమల్లి వర్గాల మధ్య రోజు రోజుకు విభేదాలు జోరందుకోవడంతో రెండు గ్రూపు లుగా కాంగ్రెస్ నాయకులు మారారు. నేదురుమల్లికి మద్దతుగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు వ్యవహ రిస్తుండగా, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మేకపాటి వర్గీయులు ప్రస్తుతం ఆనం సోదరులతో జత కట్టారు.

నేదు రుమల్లి సోదరుల మధ్య ఎన్‌బీకేఆర్ విద్యా సంస్థల వివాదాన్ని వర్గపోరుకు వేదికగా మలిచారు. నేదురుమల్లి పద్మనాభరెడ్డికి పనబాక కృష్ణయ్య, రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిలు మద్దతుగా నిలిచి సీఎం రోశ య్యను కలిసి జనార్దన్‌రెడ్డిపై ఫిర్యా దులు చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నెల రోజులు గడిచినా దీనిపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. సోనియాను కలిసిన పనబాక లక్ష్మి
కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు రాలు సోనియాగాం««ధీని ఢిల్లీలో కలిశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా రాజకీయాల వరకు తానే నాయకుడని, కాంగ్రెస్‌కు పెద్ద దిక్కునంటూ చెప్పుకునే నేదురుమల్లి జిల్లాలో పార్టీని భూస్థాపితం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గూడూరు, సూళ్లూరుపేట, కోవూరు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమికి ఆయనదే బాధ్యతని సోనియా దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. చిల్లకూరు, కోట సెజ్‌లలో బినామీల పేరుతో ఆయన అనుచరులు ప్రభుత్వ సొమ్మును కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు.

ముఖ్య అనుచ రులుగా ఉన్న ఐదుగురిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారని, గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ నివేదికలు బహిర్గతం చేయాలన్నారు. ఇదే విధంగా వదిలేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, ఇప్పటికైనా నేదురు మల్లిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది. నేదురుమల్లిపై సోనియాకు పనబాక లక్ష్మి ఫిర్యాదు చేయడం జిల్లాలో కాంగ్రెస్ వర్గీయుల్లో చర్చనీయాంశమైంది.

సీఎం పర్యటనకు తప్పని వర్గపోరు
మే 2న నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్న సీఎం కె.రోశయ్య పర్యటనకు కాంగ్రెస్ వర్గపోరు వీడడం లేదు. గురువారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో కలిసి సీఎం పర్యటించే ప్రాంతాలను సందర్శించారు. ఏర్పా ట్లపై అధికారులతో చర్చించి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఓ రోజంతా సీఎం నెల్లూరులో గడప నుండడంతో ఆ మేరకు కార్యక్రమాలు రూపొందించే పనిలో మంత్రి బిజీబిజీగా గడిపారు.

జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజీవ్ భవన్ నాయకుల నేతృత్వంలో శుక్రవారం సీఎం పర్యటన ఏర్పాట్లపై పరిశీలించ నున్నారు. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల నాయకులు ఇలా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించడం అధికారులకు తలనొప్పిగా మారనున్నది. రెండు వర్గాలు సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పోటా పోటిగా ప్రచారాలు చేస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న రోశయ్యకు కాంగ్రెస్ వర్గపోరు ఎలా స్వాగతం చెబుతుందో వేచి చూడాల్సిందే.

No comments: