నేడు నెల్లూరు

Saturday, April 10, 2010

సిఎం పర్యటన వాయిదా

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు సిఎం పేషీ నుండి శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందింది. దీనితో ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగాల్సిన భూపంపిణీ కార్యక్రమం కూడా వాయిదా పడింది. సిఎం పర్యటన, భూపంపిణీ వాయిదా విషయాన్ని జిల్లా కలెక్టర్ కె రామ్‌గోపాల్ ధృవీకరించారు. అదే రోజున ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రికి అపాయంట్‌మెంట్ ఖరారయనందునే పర్యటన వాయదా పడినట్టు తెలిపారు.

No comments: