నేడు నెల్లూరు

Monday, April 19, 2010

నేటి నుంచి ప్రజాపధం

సోమవారం నుంచి ప్రజా పథం కార్యక్రమాన్ని నిర్వహించనున్నా రు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరురూరల్ మండలం మైపాడుగేటు వద్ద ఉన్న వేణుగోపాల్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించను న్నారు. తొలి రోజు పది మండలాల్లోనే ప్రజాపథం నిర్వహించి, ఆ తరువాత మరో మండంలో అధికారులు అడుగు పెట్టనున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే ముఖ్య అతి«థులుగా పాల్గొననున్నారు.

ఏడు అంశాలకు ప్రాధాన్యం

ఈ కార్యక్రమంలో ప్రజా సమస్య లనే చర్చిస్తూ సభలు, సమావేశాలకు పరిమితం చేశారు. మొత్తం ఏడు అంశాలతో ఈ సారి ఐదో విడత ప్రజా పథాన్ని నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దారు, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ, పీఆర్ఏఈ తదితర అధికారులతో మొబైల్ టీం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో వీఆర్‌వో పర్యవేక్షణలో మరో బృందాన్ని ఏర్పాటు చేశారు.

రోజుకు నాలుగు నుంచి ఐదు గ్రామాల్లో వీరు పర్యటిస్తారు. ఆయా ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తేదీలు ఖరారు చేసి పర్యటన కార్యక్రమాన్ని రూపొందిం చారు. జిల్లా అధికారులు ఈ కార్యక్ర మాన్ని సజావుగా నిర్వహించేందుకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించగా, కలెక్టర్ కె. రాంగోపాల్ నెల్లూరు డివిజన్, జేసీ సౌరబ్‌గౌర్ గూడూరు డివిజన్, అదనపు జేసీ సీతారామాయ్య కావలి డివిజన్‌లలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. నియోజకవర్గానికి ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రజాపథం ముగిసిన తరువాత మరో మండలం లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల నుంచి అందే వినతులను ఏరోజు కారోజు డేటా ఎంట్రీ చేసి వాటిని జిల్లా కేంద్రానికి పంపుతారు. తాగునీటి సమస్య ఉంటే అందుకు అవసరమైన నిధులు వాటి వివరాలు కూడా ఈ నివేదికల ద్వారా తెలియజేయాలి. బోర్లు ఇతర చిన్న చిన్న రిపేర్లను మాత్రం వెంటనే చేస్తారు. దీని కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 4 కోట్లను విడుదల చేసింది. పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దు, తాగునీటి సమస్యపై గ్రామాలకు వచ్చే అధికారులను నిలదీసేందుకు ప్రజలు కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెటుకున్న ప్రభుత్వం ప్రజలతో ఎక్కడ కూడా వివాదాలకు దిగ దంటూ అధికారులను కోరింది.

No comments: