Tuesday, April 6, 2010
నెల్లూరు టవున్ హాలు లో వై.కామేశ్వరరావు మెమోరియల్ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభం
సోమవారం రాత్రి నెల్లూరు పురమందిరం ఓపెన్ ఆడిటోరియంలో వై.కామేశ్వరరావు మెమోరియల్ నా టక పరిషత్ 2010 రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో భానుచందర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. పోటీల్ని జ్యోతి ప్ర జ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడు తూ కళాకారులు, ప్రేక్షకులు ఎదురు ఎదురుగా ఉండి ఒకరి హృదయాలలో ఒకరు ఇమిడిపోయే ప్రక్రియ ఒక నాటకంలోనే ఉందన్నారు. ఏదైనా కళను ప్రాక్టీసు చేస్తే రాదని, కళ భగవంతుడు ఇచ్చే వరం అన్నారు. మంచి స్నేహశీలి వై.కామేశ్వరరావును భౌతికంగా చూడకపోయినా ఆయన స్మారకంగా జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటికల పోటీలలో పాల్గొనడం తన అదృష్టంగా తెలిపారు. సినిమాలు, టీవీలు వచ్చినా నాటకాలకు ఇంకా ఆదరణ ఉందనే వాటిని ప్రోత్సహిస్తు న్న ప్రేక్షకుల గొప్పదనమని కీర్తించా రు.
భానుచందర్ కు ఘనంగా సన్మానం
వై.కామేశ్వరరావు మెమోరియల్ నాటక పరిషత్ 2010 తరపున భానుచందర్కు సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. పరిషత్ తరపున భానుచందర్ బంగారు నంది అవార్డు గ్రహీత మేకప్మెన్ ఫరీఫ్ను, భక్తిగీ తాల గాయకుడు గూండాల గురవ య్యలను, వై.కామేశ్వరరావు, స్మారక అవార్డు, ప్రముఖ హాస్యనటులు కొండ వలస లక్ష్మణరావు,లకు నగదు పుర స్కారాలు అందజేశారు.
అనంతరం వేదిక అలంకరించిన ప్రముఖులంద ర్ని భానుచందర్ సన్మానించారు. .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment