నేడు నెల్లూరు

Wednesday, June 15, 2011

Anam Brothers vs Mekapati Brothers

Thursday, June 9, 2011

బొత్సా శిబిరంలోకి ఆనం

కాంగ్రెస్‌లో సమీకరణాలు మళ్లీ మారుతున్నాయి. మొదట కిరణ్‌కుమార్‌రెడ్డికి సమీపంగా ఉండి ఆ తర్వాత ఆయనకు కాస్త దూరమైన నేతలు.. పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు.. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి.. ముఖ్యమంత్రి కిరణ్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో ఏమైందో కానీ.. కిరణ్‌ ఈయన్ను కాస్త దూరంగా పెట్టడం ఆరంభించారు. ప్రణాళికా సంఘం మీటింగ్‌కు కానీ ఆ తర్వాత బ్యాంకర్ల సమావేశానికి కానీ.. ఆనం లేకుండానే సీఎం నడపడం అసంతృప్తికి దారి తీసింది. సీఎం కావాలనే తనను దూరంగా ఉంచుతున్నాడని ఆనం భావించే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలోనే మంత్రి బొత్స పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆనం వెంటనే బొత్సా శిబిరంలో ముఖ్యుడిగా మారిపోయారు. 11 తేదీన గాంధీభవన్‌లో భారీ ఎత్తున జరిగే పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవానికి.. ఏర్పాట్లు చేసే బాధ్యతను ఆనం రాంనారాయణ రెడ్డి తన నెత్తిమీద వేసుకున్నారు. మంత్రి దానం నాగేందర్‌ ముఖేష్‌లు ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి జన సమీకరణ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించి సమన్వయపరచే డ్యూటీని కూడా ఆనంకు బొత్సా అప్పజెప్పారని తద్వారా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారని భావిస్తున్నారు. బొత్సా గాంధీభవన్‌ ప్రవేశం ఘనంగా జరిగితే ఆ క్రెడిట్‌ ఆనంకు కూడా వస్తుందన్న మాట. తద్వారా బొత్సా దగ్గర ఆనం మాటకు విలువ పెరుగుతుంది.

Wednesday, June 8, 2011

వెంకయ్య నాయుడు గారి సుద్దులు

నల్లధనాన్ని వెలికి తీస్తే దేశంలో పేదవాడు ఉండడని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్.వెంకయ్య నాయుడు అన్నారు.రాందేవ్ బాబా దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా బిజెపి చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.రాందేవ్ దీక్షను భగ్నం చేయడం, అది కూడా అర్ధరాత్రి చేయడం, మహిళలను, పిల్లలను విచక్షణారహితంగా కొట్టడం దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పని చేయడం లేదన్నారు.నల్లధనం కుబేరుల గురించి వెల్లడించడానికి కేంద్ర మంత్రి ప్రణబ్ సిగ్గుపడుతున్నారని ఆయన విమర్శించారు. వెంకయ్యనాయుడు, కాని బిజెపి అగ్రనేతలు ఎల్.కె.అద్వాని, నితిన్ గడ్కరి వంటి వారు రాందేవ్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి నిరసన కార్యక్రమాలకు దిగడంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది.అయితే బిజెపి ముందుగా నల్లధనం విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో చెబితే బాగుంటుంది. ఒకపక్క కర్నాటకలో గాలి జనార్ధనరెడ్డి వంటి మంత్రులకు పెద్ద పీట వేస్తూ, మరో పక్క నల్లధనం గురించి వెంకయ్యనాయుడు కాని, మరెవ్వరైనా కబుర్లు చెబితే జనం నమ్ముతారా? అన్నది ప్రశ్న. కనుక వెంకయ్యనాయుడు గారు ముందుగా గాలి జనార్ధనరెడ్డితో తనకు ఎలాంటి అక్రమ లావాదేవీలు లేవని, లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ చేసిన ఆరోపణలలో తనకు సంబంధం లేదని వెంకయ్యనాయుడు చెప్పగలిగితే , అవినీతికి వ్యతిరేకంగా ఈయన కూడా గట్టిగా మాట్లాడుతున్నారని

చిరంజీవికి షిప్పింగ్ శాఖ?

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కాంగ్రెస్ పై పెద్ద ఆశలనే పెట్టుకున్నారని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయనకు కేంద్రంలో పెద్ద పదవి వస్తుందని అంతా అనుకుంటున్నారు అయితే స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర మంత్రి పదవి అని చెబుతున్నారు. దీనికి సంబంధించి చిరంజీవి ప్రాధాన్యతలను అడిగితే రైల్వేశాఖ లేదా గ్రామీణాభివృద్ది శాఖలను ఇస్తే బాగుంటుందని సూచించారని చెబుతున్నారు. దానికి కాంగ్రెస్ నాయకులు కాస్త ఆశ్చర్యపోయారట. అప్పుడే అంత పెద్ద శాఖ కోరుతున్నారా అని అనుకున్నారట. ఆ తర్వాత షిప్పింగ్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని వారు చెప్పారని అంటున్నారు. చిరంజీవి సన్నిహితుడైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షిప్పింగ్ రంగంలో అనుభవం ఉంది. ఆ పరిశ్రమను ఆయన నడుపుతున్నారు. కనుక ఆ శాఖ వచ్చినా బాగానే ఉంటుందని వారు అనుకుంటున్నారట. కాగా ప్రజారాజ్యం విలీనం ప్రక్రియ పూర్తి అయ్యేవరకు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చని చెబుతున్నారు.విలీనం సభను విశాఖపట్నంలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఏమి జరిగినా ఆ సభ తర్వాతే అంటున్నారు. కాగా ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రంలో రెండు మంత్రి పదవులే ఇవ్వగలుగుతామని అధిష్టానం పెద్దలు చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది.

నవంబర్‌ 16. కిరణ్‌ సర్కార్‌కు జ్యోతిష్యుల డెడ్‌లైన్‌

నవంబర్‌ 16, 2011.. కిరణ్‌ సర్కార్‌కు జ్యోతిష్యుల డెడ్‌లైన్‌ ఇది. రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు జరగబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్యులు చెప్పారు. ఎన్టీవీలో ఓ డిస్కషన్‌కు వచ్చిన ముగ్గురు జ్యోతిష్యులు.. ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌ 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి మారుతున్నారని.. నర్సింహాచారి అనే జ్యోతిష్యుడు చెప్పారు. తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇక ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా.. రాష్ట్ర విభజన జరగదని వారు చెప్పారు. ఉద్యమ ప్రభావం ఆగస్టు వరకే ఉంటుందన్నారు. నవంబర్‌ తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని.. వారు చెప్పారు.

100 కోట్లతో జీవీకే మనవరాలి పెళ్లి


ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త వ్యాపారవేత్త అయిన గుణుపాటి వెంకటకృష్ణారెడ్డి ( జీవీకే రెడ్డి ) మనువరాలు మల్లిక వివాహం.. బ్రహ్మండమైన రీతిలో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో న్యూజీలాండ్‌కు చెందిన ఒక ప్రవాసాంధ్రుడు హైదరాబాద్‌లో 40 కోట్లు ఖర్చుపెట్టి చేస్తే.. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్ వివాహం కూడా పెద్ద పెద్ద సెట్టింగుల మధ్య రమణీయంగా జరిగింది. అంతకుముందు వైభవంగా సాగింది. వాటన్నింటినీ తలదన్నే రీతిలో జీవీకే రెడ్డి మనవరాలి పెళ్లి.. సినీరంగ ప్రముఖుడు.. శ్యాంప్రసాద్‌రెడ్డి కుమారుడు సిద్ధార్తరెడ్డితో జరగబోతోంది. విశేషమేంటంటే.. పెళ్లి కూతురు మల్లిక తల్లి.. రాజ్యసభ సభ్యులు మరో పారిశ్రామిక వేత్త సుబ్బిరామిరెడ్డి కుమార్తె కావడం. వీరి ఎంగేజ్‌మెంట్‌ సెర్మనీయే అప్పట్లో పెద్దవార్తగా చెప్పుకున్నారు. వీరి వివాహానికి ముంబై ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడపబోతున్నారు. ఈ వివాహానికి వస్తున్న ప్రముఖుల పేర్ల జాబితాలో.. ముఖేష్ అంబానీ, సల్మాన్‌ఖాన్‌, అభిషేక్‌ ఐశ్వర్యారాయ్‌బచ్చన్‌, పలువురు కేంద్రమంత్రులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది ప్రముఖులు రాబోతున్నారు. కరన్‌జొహార్‌, షారూఖ్‌ఖాన్‌ అలాగే హాలీవుడ్‌నటి జెన్నిఫర్‌ లోపేజ్‌ కూడా రావొచ్చని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం మల్లికను పెళ్లికూతరుని చేసిన కార్యక్రమం సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత సినీనటి హేమమాలిని భరతనాట్య ప్రదర్శన చేయటం హైలెట్‌గా నిలిచింది. జూన్‌ 12 వ తేదీన జరగబోయే ఈ కళ్యాణ వేడుక గతంలో జరిగిన వివాహాలను మించిపోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 40 నుంచి 50 కోట్ల ఖర్చుతో జరిగిన పెళ్లే రికార్డ్‌గా భావిస్తుంటే.. బహుశా జీవీకే వారింట పెళ్లి వంద కోట్లకు చేరుతుందేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నారు.