నేడు నెల్లూరు

Tuesday, April 13, 2010

మద్రాసు బ స్టాండు వద్ద రోడ్డు మార్టిన్ వ్యాపారాల తొలగింపు


కూరగాయల మార్కెట్‌కు అనుసంధానంగా రోడ్డు మార్జిన్‌లో చేస్తున్న వ్యాపారాలను పోలీసులు సోమ వారం తొలగించారు. మద్రాసు బ స్టాండు సమీపంలోని ఏసీ కూరగా యల మార్కెట్ వెలుపల ఆకుకూర లు, పండ్లు, టెంకాయలు, కూరగాయ లు తదితర వ్యాపారాలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. స్వచ్ఛం దంగా వ్యాపారాలు ఎత్తివేయాలని ఎ న్నిసార్లు చెప్పినా సదరు వ్యాపారులు వినలేదు. దీంతో నగర డీఎస్పీ రాధిక, ట్రాఫిక్ సీఐ రాఘవరావు, నగర సీఐ వీరాంజనేయరెడ్డి, నగర ప్లానింగ్ అధి కారి రాజేంద్రప్రసాద్‌నాయక్, ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ప్రాం తానికి చేరుకుని రైతు బజారులో వ్యా పారాలు పెట్టుకోవాలని వ్యాపారులకు సూచించారు.

దీంతో వ్యాపారులు త మ నిరసన తెలిపారు. డీఎస్పీ రాధిక వ్యాపారుల దగ్గరకు వెళ్ళి ఎస్పీ ఇ.దామోదర్ ఆదేశాల మేరకు తాము ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అక్కడకు వచ్చిన సీపీఎం నాయకు డు మోహన్‌రావు ఆధ్వర్యంలో వ్యా పారులందరూ ప్రదర్శనగా కలెక్టర్ కా ర్యాలయానికి వెళ్ళి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ లోపు కార్పొరేష న్ జేసీబీతో రోడ్డు పక్కన ఫ్లాట్‌ఫారా లను పోలీసులు తొలగించారు. మా ర్కెట్లో నిర్ణీత పరిధిదాటి ముందుకు వచ్చిన షాపు రేకులను, వ్యాపారాలను ఎత్తివేయాలని పోలీసులు ఆదేశించా రు. అలాగే వాహనాలను అడ్డదిడ్డం గా పార్కింగ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ తొలగింపు కార్య క్రమాన్ని జిల్లా ఎస్పీ ఇ.దామోదర్ ప రిశీలించారు. ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజ లు, పార్టీలు, వ్యాపారులు సహకరిం చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాల్గవ నగర ఎస్ఐ వేమారెడ్డి, ట్రాఫిక్ ఫ్లెయింగ్ స్క్వాడ్ ఎస్ఐలు దశర«థరామన్, వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస రావు, గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

No comments: