Tuesday, April 6, 2010
కోర్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల : ఎమ్మెల్యే ఆనం వివేకా
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అవసరమయ్యే మౌళికసదుపాయాలను అందించడంలో మందుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. మండల పరిధిలోని నారాయణరెడ్డిపేట గ్రామానికి చెందిన చేవూరి రంగారెడ్డి, వెంకమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు ఇక్కడి జడ్పీ హైస్కూల్ విద్యార్ధులకు సోమవారం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే వివేకా మాట్లాడుతూ పాఠశాలకు అవసరమయ్యే 12అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరుచేయిస్తానన్నారు. క్రీడా ప్రంగణం కోసం స్థలం మంజూరుచేయిస్తానని హామినిచ్చారు. పాఠశాల లెవలింగ్ నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. హైస్కూల్ ప్రవేశ ద్వారానికి ఎంపీటీసి నిధులు ద్వారా హాచ్ నిర్మిస్తామన్నారు. కోర్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని విధాల సహకరిస్తానని ఆయన హామినిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment