నేడు నెల్లూరు

Saturday, April 10, 2010

పెంచలకోన అభివృద్ధికి మోహన్‌బాబు రూ. లక్ష విరాళం

పెంచలకోన ఆలయ అభివృద్ధికి ప్రముఖ సినీ నటుడు, లక్ష్మీప్రసన్న ఆర్ట్‌మూవీస్ అధినేత మంచు మోహన్‌బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. శుక్రవారం ఆయన స్వామి దర్శనానికి ఇక్కడకు వచ్చారు. ఆలయ పాలకవర్గ చైర్మన్ అమరా శ్రీరాములుశ్రేష్టి, సహాయ కమిషనర్ శ్రీరామమూర్తి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో సహా వచ్చిన ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు స్వామివారికి, అమ్మవారికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి చైర్మన్ అమరా శ్రీరాములు వారికి వివరించారు. ఇందుకు స్పందించిన మోహన్‌బాబు వెంటనే తనవంతుగా ఆలయ అభివృద్ధి పనులకు లక్ష రూపాయల విరాళం ఇస్తానంటూ ప్రకటించారు. అనంతరం ఆయనకు స్వామి, అమ్మవార్ల ప్రసాదాన్ని వేదపండితులు అందజేశారు. రాపూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఆయన తోటల్లోకి వచ్చిన సందర్భంగా స్థానిక విలేఖర్లు వార్త సేకరణ నిమిత్తం వెళ్లగా ఫోటోలు తీసేందుకు, వీడియో చిత్రీకరించేందుకు ఆయన నిరాకరించారు.

No comments: