నేడు నెల్లూరు

Monday, April 19, 2010

నెల్లూరు రైల్వే స్టేషన్ స్క్రాప్ గోదాములో దొంగలు పడ్డారు

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని నెల్లూరు రైల్వే స్టేషన్ స్క్రాప్ గోదాములో దొంగలు పడ్డారు. రైల్వే సిబ్బందే స్వయంగా స్క్రాప్ పరికరాలను రహస్యంగా ఒక్కొక్కటి తరలించి మాయం చేస్తున్నారు. రైల్వేశాఖ నిఘా, నియంత్రణ కరువవుతుండడంతో ఎన్నో ఏళ్లుగా ఈ తంతు నిర్విఘ్నంగా సాగుతోంది. ఇనుము, టేకు దుంగ లను దర్జాగా తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా రు. ఇలా ఏటా సుమారు రూ.5లక్షలకు పైగా సి బ్బంది చేతివాటంతో స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘా పెట్టి సాక్ష్యాలతో సహా ఈ అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది.

స్క్రాప్ గోదాము సిబ్బంది వరం

దేశంలో అతిపెద్ద సంస్థగా విస్తరించి ఎంతోమంది ప్రయాణికుల ను చేరవేస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పించే శాఖగా రైల్వేకు మంచి పేరుంది. ఈ శాఖలో రైలు పట్టాల నిర్వహణకు అధికారులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. రైలు పట్టాలు కొంచెం సరిలేకున్నా ఆ పరికరాలను స్క్రాప్ కింద తీసేస్తారు. ఉడెన్ స్వీపర్స్, రబ్బర్‌ప్లేట్లు, క్లాంపులు, బోల్టులు, రైలు పట్టాల ముక్కలు పెద్ద ఎత్తున స్క్రాప్ కింద చేరుతాయి.

ఇలా వచ్చిన వాటిని నెల్లూరు రైల్వే స్టేషన్‌లో గోదాములలో నిల్వ చేస్తారు. వీటిని జాగ్రత్తపరచి ప్రతి ఏటా టెండర్లు నిర్వహించి అమ్మకాలు జరిపి వచ్చిన సొమ్మును రైల్వే ఖాతాలో జమ చేయాలన్నది నిబంధన. కాని ఈ స్క్రాప్‌ను దాచి పెట్టడమే రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. అధికా రులు, సిబ్బంది కుమ్మకై వాటిని మాయం చేస్తున్నారు. ఉడెన్ స్వీపర్స్ పూర్తిగా టేకువే ఉంటాయి. ఇవి గృహో పకరణాలకు విరివిగా ఉపయోగిస్తారు.

ఒక్క దిమ్మె సామిల్లు యజమానులు రూ. వెయ్యికి కొనుగోలు చేస్తే వాటిని ముక్కలుగా చేసి రూ. 4నుంచి 5వేల వరకు అమ్మకాలు సాగిస్తారు. ఇదే రీతిన ఇనుప పరికరాలను, ఇనుప సామాన్ల దుకాణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నెల్లూరు రైల్వే స్టేషన్ గోదాములలో ఏడాదికి రూ. 5 నుంచి 6 లక్షల వి లువైన పరికరాలు మాయం చేస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బిట్రగుంటలోని ఓ పాత సినిమా హాలును విజిలెన్స్ అధికారు లు తనిఖీ చేయగా, కొన్ని వేల ఇనుప స్వీపర్లు దొరికాయి. ఇనుప సామాను వ్యాపారుల వద్ద రైల్వే పరికరాలు ప్రత్యక్షమైనా చిన్న చిన్న కేసులతో రాజీ చేసుకుని చేతికందిన మేరకు సొమ్ము చేసుకుని గోప్యంగా ఉంటున్నారు.

ఇదిగో సాక్ష్యం..
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో పనిచేసే రైల్వే క్లాస్ ఫోర్ ఉద్యోగి వెంకటేశ్వర్లు రైలు పట్టాలు కింద అమర్చే టేకు దిమ్మెను ముఠామేస్త్రి సాయంతో రైల్వే స్టేషన్‌కు సమీపంలో శెట్టిగుంట రోడ్డు వద్ద ఉన్న ఓ సామిల్లుకు రిక్షాలో తరలించారు. వెంటనే సామిల్లు కూలీలుఈ దిమ్మెను ముక్కలుగా చేసి నాజుక్కుగ్గా తయారు చేయడంలో నిమగ్నంకాగా,ఇక్కడే ఉన్న వెంక టేశ్వర్లను ఇదేమిటని ప్రశ్నిస్తే...... సమాధానం చెప్పక పరుగులు తీశాడు.

కార్యాలయానికి వెళ్లి విచారిం చగా, అక్కడే ఉన్న వెంకటేశ్వర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను చూసి మరోసారి పరుగులు తీశాడు. ఇదే విషయాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారులు, నిఘా అధికారుల దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులో లేరు.విధుల్లోఉన్న సిబ్బందిని అధికారుల వివరాలను కోరగా వారు చెప్పెందుకు నిరాక రించారు.

రక్షణ మాటేమిటి ?
నెల్లూరు రైల్వేస్టేషన్ స్క్రాప్ గోదాముల్లో రైల్వే పరికరాలు విచ్చల విడిగా పడేశారు. పీడబ్ల్యు కార్యాల యంలో ఇనుప దిమ్మెలు, టేకు కొ య్యలు భారీగా ఉన్నా వీటికి రక్షణగా కంచె ఉన్నా అది నామమాత్రమే. పేరుకు గేటు ఉన్నా అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. స్బిబందికి సొమ్ము అవసరమైతే దర్జాగా ఈ గోదాము నుంచి స్క్రాప్ పరికరాలను బయటకు తరలించి అమ్ముకుంటున్నారు. ఎంతో విలువైన ఈ పరికరాలకు రక్షణ కరువవడంతో ఇంటి దొంగలే స్వాహా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరచి నియంత్రించకపోతే రైల్వేశాఖ భారీగా నష్టపోనున్నది.

No comments: