నేడు నెల్లూరు

Monday, January 31, 2011

Gold coins found in Swarnamukhi river

లవకుశ నిర్మాత ... అల్లారెడ్డి శంకర్‌రెడ్డి

‘లవకుశ’ - తెలుగు ప్రజలు నెలల తరబడి బళ్లు కట్టుకుని, క్యారేజీలు చేత బట్టుకుని వెళ్లి థియేటర్ల ముందు పడిగాపులు పడి చూసిన సినిమా. తెలుగు సినిమా చరిత్రలో అది సృష్టించిన రికార్డులు, ఆ సినిమాలో రంగులన్ని. ఉత్తమ ప్రాంతీయ చిత్ర విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న ఇంత గొప్ప కళాఖండాన్ని నిర్మించిన వ్యక్తి అల్లారెడ్డి శంకర్‌రెడ్డి.
లవకుశ నిర్మాత ... అల్లారెడ్డి శంకర్‌రెడ్డి
5 ఫిబ్రవరి 1931 21 మార్చి 1978



లలితా శివజ్యోతి పిక్చర్స్ వ్యవస్థాపకుడు, అధినేత అయిన అల్లారెడ్డిది శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లావిడవలూరు మండలం నాయుడుపాలెం. 1915 ఫిబ్రవరి 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు.
1963కు ముందు
తెలుగు సినిమా తెలుపు-నలుపుల సినిమా. తొలిసారి తెలుగు ప్రజలకు లవకుశ రంగులలోకాన్ని చూపించింది. ఆ లోకాన్ని సి.పుల్లయ్య సృజిస్తే.. శంకర్‌రెడ్డి సృష్టించారు.

అసలు ఈ సినిమా విజయం గురించి చెప్పుకోవడానికి ముందు శంకర్‌రెడ్డి పడిన కష్టాలు తెలుసు కోవాలి. ఎందుకంటే అవి నిజంగా సినిమా కష్టాలే. అణా (రూపాయికి పదహారణాలు) కూడా పెద్ద మొత్తంగా భావించే రోజులవి. అప్పట్లో ఈ సినిమాకు అల్లారెడ్డి శంకర్‌రెడ్డి పెట్టడానికి సిద్ధమయిన ఖర్చెంతో తెలుసా... అక్షరాలా 30 లక్షల రూపాయలు. ఆయన ధైర్యానికి ఆనాటి తెలుగు సినీ రంగం నోరెళ్ల బెట్టింది. అప్పటికదే భారీ బడ్జెట్ చిత్రం.

ప్రారంభ కష్టాలు
శంకర్‌రెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించినా వ్యాపారవేత్తగా ఎదగాలని ఆలోచించేవారు. లక్నోలో ఎమ్మే, ఎల్‌ఎల్‌బీ చేశారు. న్యాయమూర్తి ఉద్యోగం వచ్చినా చేరలేదు. 1941లో ఆంధ్రదేశంలోనే తొలిసారిగా సెరామిక్ ఫ్యాక్టరీని నెల్లూరులో నెలకొల్పారు. తర్వాత సినీరంగంలోకి వచ్చి లలితా శివజ్యోతి పిక్చర్స్ స్థాపించారు. ఆ బ్యానర్ తొలిచిత్రం ‘మానవత’ (1948). మొదటి ప్రయత్నమే అట్టర్ ఫ్లాప్. స్వగ్రామంలో ఉన్న ఆస్తులు చాలావరకు కరిగిపోయినా కుంగిపోలేదు. తర్వాత తెలుగు, తమిళ భాషల్లో తీసిన మల్టీస్టారర్ మూవీ ‘చరణదాసి’ కాసులు కురిపించింది. ఈ స్ఫూర్తితోనే ఆయన లవకుశ తీశారు.

రంగుల్లో సృష్టించిన పౌరాణికం

నిర్మాతగా తనకు సంబంధం లేకపోయినా సినిమాకు ముందే రామాయణాన్ని అవపోసన పట్టారు. 1958లో ప్రారంభమైన లవకుశ చిత్ర నిర్మాణం 1963 వరకు కొనసాగింది. మధ్యలో చాలాకాలం ఆ సినిమా ఆర్థిక కష్టాలతో ఆగిపోయింది. దీంతో లవకుశులుగా నటించిన పిల్లలు పెద్దవాళ్లయిపోయారు. దర్శకులు పుల్లయ్య అనారోగ్యం బారిన పడ్డారు. నటీనటుల కాల్షీట్లు అయిపోయాయి. చేతిలో డబ్బు లేదు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. అయినా ఆయన చిత్ర నిర్మాణం నుంచి వైదొలగలేదు.

మళ్లీ డబ్బులు జమ చేసుకున్నారు. సినిమాను విలక్షణంగా తీర్చిదిద్దడానికి శంకర్‌రెడ్డి తీసుకున్న శ్రద్ధ అపారం. రామారావు వాడిన కిరీటాలు, ఆభరణాలు, దుస్తులు.. అన్నీ ప్రత్యేకంగా బొంబాయిలో తయారు చేయించారు. అప్పటికి అందుబాటులో ఉన్న గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. 1963 మార్చి 29న 26 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని ఊళ్లలో శతదినోత్సవం జరుపుకుని అప్పట్లో సంచలనం సృష్టించింది. మొత్తం 72 కేంద్రాల్లో శత దినోత్సవం, 16 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకొంది. 10 కేంద్రాల్లో 250 రోజులు, హైదరాబాద్‌లో 67 వారాలు ఆడింది.

మాయాబజార్ తర్వాత సాంకేతిక విలువలున్న గొప్ప చిత్రంగా తెలుగు సినీ చరిత్రలో లవకుశ నిలిచిపోయింది. దక్షిణాదిలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం ఇదే! పైసల్లో సినిమా టిక్కెట్లు అమ్ముతున్న రోజుల్లో ఈ చిత్రం వసూలు చేసిన సొమ్ము పెరిగిన కరెన్సీ విలువ ప్రకారం చూస్తే ఇప్పటికీ అధిగమించని రికార్డు కిందే లెక్క. లవకుశులను గేవాకలర్‌లో ముస్తాబు చేసిన శంకర్‌రెడ్డి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

ఆజానుబాహుడు, తెల్లని గ్లాస్కో పంచె, తెల్లని హాఫ్ షర్టు ధరించే శంకర్‌రెడ్డి అంటే ఎన్టీఆర్‌కు ప్రత్యేక అభిమానం, గౌరవం ఉండేవి.

శంకర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరినీ తన బావమరిది కుమారులకే ఇచ్చి వివాహం చేశారు. పెద్ద కుమార్తె దేవళ్ల అమృతవల్లి. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె దేవళ్ల విజయలక్ష్మి. నెల్లూరులోని ఇస్కపాలెంలో నివాసం.

శంకర్‌రెడ్డి నిర్మించిన చిత్రాలు
మానవత (1948)
చరణదాసి (1954)
లవకుశ (1963)
రహస్యం (1978)
సతీ సావిత్రి (1978)

Monday, January 24, 2011

Wednesday, January 12, 2011

నిత్య జీవితంలో జరిగే సంఘటనలే సినిమా ; నటుడు రాజేంద్రప్రసాద్

సమాజంలో ప్రతిఒక్కరి నిత్య జీవితంలో జరిగే సంఘటనలే సినిమాలని నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఆ నలుగురు, లేడీస్ టైలర్ సినిమాలు రూపుదిద్దుకున్నాయన్నారు. తాను నెల్లూరు జిల్లా గూడూరులో చదువుకున్నానని, స్వర్ణ్భారత్ ట్రస్ట్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రముఖ హాస్యనటుడు ఆలీ మాట్లాడుతూ తాము మాట్లాడే భాషకు లిపి, అర్థం ఉండవని, హాస్యం ఉంటుందని, అయితే వెంకయ్యనాయుడు అనర్గళంగా ఎన్నో భాషలు మాట్లాడగల సమర్థుడని అన్నారు. సినిమా నటులు, ఇతర అనేక మంది జ్యోతి ప్రజ్వలనతో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్సీ ఇ దామోదరం మాట్లాడుతూ హేతుబద్ధంగా, శాస్తబ్రద్ధంగా సంక్రాంతి పండుగను జరపటం గొప్ప విషయమన్నారు. జిల్లా కలెక్టర్ కె రాంగోపాల్ మాట్లాడుతూ నేడు జాతీయ నేతలను మర్చిపోతున్నామని, అలా కాకుండా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం స్వర్ణ్భారత్ ట్రస్ట్‌ను అభినందించాలన్నారు. ఒంగోలు ఎంపి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వర్ణ్భారత్ ట్రస్ట్ సంక్రాంతి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండి శైలజాకిరణ్ మాట్లాడుతూ స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో విద్యార్థులకు లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్టు సభలో ప్రకటించారు. హిందీ భాషాభివృద్ధి అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఐదుగురు మహానీయులు శ్రీ కృష్ణుడు, క్రీస్తు, మహ్మద్ ప్రవక్త, బుద్ధుడు, మహాత్మాగాంధీలని, వీరిలో ముగ్గురు మన వాళ్లేనని, ఈ విషయం మన పిల్లలకు వివరించాలని అన్నారు.

సినిమా రంగానికి చిరంజీవి మూడో నేత్రం : వెంకయ్యనాయుడు

సినిమా రంగంలో అందరూ ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్‌లను రెండు కళ్లుగా అభివర్ణిస్తుంటారని అయితే చిరంజీవి మూడవ నేత్రం అని బిజెపి జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. వెంకటాచలం సరస్వతి నగర్ అక్షర నిలయంలో వివేకానందస్వామి విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. మూడవ కన్నుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం అందరికీ తెలుసునని, అలాగే చిరంజీవి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అని వెంకయ్యనాయుడు అన్నారు.
జైలు జీవితం నా జీవితానే్న మార్చేసింది : వెంకయ్యనాయుడు
అప్పట్లో ఎమర్జన్సీ, ఇందిర ప్రభుత్వం హయాంలో జైలుకెళ్లటం తన జీవితానే్న మార్చేసిందని బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తన మిత్రుడు, హిందీ భాష అభివృద్ధి అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో కలిసి ఒకసారి జైలుజీవితాన్ని గడిపామని, ఆ జైలులోనే అనేక భాషలు నేర్చుకోవటంతోపాటు క్రమశిక్షణ, ఎలా జీవించాలి, ఏం సాధించాలనే అంశాలను నేర్చుకున్నట్టు వెంకయ్యనాయుడు తన జైలు జీవితాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.