Thursday, April 1, 2010
కలసిన నేదురుమల్లి సోదరులు
నేదురుమల్లి పద్మనాభరెడ్డి మనుమరాలి వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి బుధవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్థన్రెడ్డి హాజరయ్యారు. గూడూరు డివిజన్లోని కోట మండలంలో గల ఎన్బికె విద్యాసంస్థల విషయంలో సోదరులైన పద్మనాభరెడ్డి, జనార్థన్రెడ్డిల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మంగళవారం పద్మనాభరెడ్డి హైదరాబాద్లో ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి తన తమ్ముడు జనార్థన్రెడ్డి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఆయన ఇంట్లో జరిగే కార్యక్రమానికి జనార్థన్రెడ్డి హాజరుకావడం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment