నెల్లూరు నగరంలో నలుగురు కార్పొరేటర్లపై పోలీ సులు నిఘా వేసినట్లు సమా చారం. వీరు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తు న్నారు. నాలుగో నగర పోలీసు స్టేషన్ పరిధిలో కొన్ని హోటళ్లను ఆసరాగా చేసుకుని ఆ నలుగురు కార్పొరేటర్లు బెట్టింగ్ నిర్వహిస్తు న్నట్లు సమాచారం. కార్పొరేటర్ల సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్ జరుగు తోందని పోలీసులు గుర్తించారు.
వీరంతా కడప, బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ కేంద్రా లుగా ఈ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పరిశీ లించిన పోలీసులు ఫోన్ ద్వారా బెట్టింగ్ వ్యవహారాలు ట్రాప్ చేయ గలిగారు. ఈ విషయాన్ని పసిగట్టిన కార్పొరేటర్లు కొన్ని సెల్ఫోన్ల నెంబర్లను వాడకుండా నిలిపివేశారు. వేరే సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు పక్కా ఆధారాల కోసం ప్రత్యేక నిఘా బృందాల చేత పరిశీలన చేస్తున్నారు. సాక్ష్యాలు సేకరించే ప్ర యత్నంలో ఉన్నారు. ఈ నలుగురు కార్పొరేటర్ల బెట్టింగ్ వ్యవహారం కోట్ల రూపాయల్లో సాగుతుందన్న అనుమా నాలున్నాయి.
Monday, April 26, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment