Monday, April 5, 2010
సమస్యలలోమహాత్మాగాంధీ పార్కు
నగరం నడిబొడ్డున గాంధీబొమ్మ సమీపంలోవున్న మహాత్మాగాంధీ పార్కు దుర్గంధాలకు నిలయంగా తయారైంది. పార్కుకు పడమర వైపున జలగం వెంగళరావ్ కార్పొరేషన్ భవనంలోని అద్దెకున్న వ్యాపారస్తులు విడుదల చేసే వ్యర్థ జలాలతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు పార్కుకు వచ్చే సందర్శకులు చెపుతున్నారు. ఒక పక్క మురికి నీటితో దుర్గంధం, మరో పక్క సినిమాహాలు వలన వచ్చే ధ్వని కాలుష్యంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా, నగరం నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు గురించి ఇక్కడ కూర్చొని విపులంగా చర్చించే మేధావులు, రాజకీయ నిపుణులు సైతం ఈ పార్కును గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఈ పార్కులో ప్రస్తుతం నీళ్ల వసతి లేక చెట్లు ఎండిపోతున్నా, వేలకు వేలు ఖర్చుచేసి నిర్మించిన వాటర్ పౌంటైన్లు కళావిహీనంగా తయారై చూపరుల ఛీత్కారాని గురవుతున్నా పట్టించుకునే నాథులే లేకపోవడం దారుణం. పార్కులో ఉన్న ఒకే ఒక బావిలోని నీరు వేసవి ప్రభావం వలన అడుగంటి పోయాయి, అయినా పార్కులోని చెట్లుకు నీరు లేకుండా ఆ మిగిలిన నీటిని పక్కన నిర్మాణం జరుపుకుంటున్న పనులకు కాంట్రాక్టర్ వాడుకోవడం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment