నేడు నెల్లూరు

Thursday, April 1, 2010

నగరంలో నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి రెండు రోజుల పర్యటన


నెల్లూరులో రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి పలు వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని ఒక వారపత్రిక ప్రతినిధి గృహంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో తాను ఆర్థిక సహాయం చేసిన ఆస్పత్రిని పరిశీలించి దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. అదేవిధంగా అనారోగ్యంతో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సిపిఎం నేత అనంతరామయ్యను పరామర్శించారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం ఇందిరాభవన్‌కు చేరుకుని కొంతసేపు గడిపారు.

ఈ సమయంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు ఆయనను కలుసుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న ఆయన స్వగృహం స్వర్ణముఖికి చేరుకున్నారు. గూడూరు, వెంకటగిరికి చెందిన పలువురు నేతలు ఆయనతో కొంత సేపు సమావేశమయ్యారు. ఎస్పీగా ఇ.దామోదర్‌ కూడా మర్యాదపూర్వకంగా నేదురుమల్లితో సమావేశమయ్యారు. ఎస్పీగా దామోదర్‌ బాధ్యతలు తీసుకున్న తరువాత నేదురుమల్లి మొదటిసారిగా జిల్లాకు రావడంతో ఎస్పీ ఆయనను కలిసారు. నేదురుమల్లితో పాటు ఆయన సతీమణి, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వారి కుమారుడు రాంకుమార్‌ రెడ్డిలు కూడా ఉన్నారు.

No comments: