Sunday, April 4, 2010
నెల్లూరు రైల్వేస్టేషన్ను తనిఖీ చేసిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి మునియప్ప
నెల్లూరు రైల్వేస్టేషన్ను తనిఖీ చేసిన మంత్రి మునియప్ప స్టేషన్ నిర్వహణతో పాటు అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. ప్రధానంగా ప్రయాణీకులకు అవసరమైన మంచినీటి వసతిని పరిశీలించిన మంత్రి అక్కడ నీరు వేడిగా వస్తుండడంతో అధికారులపై మండిపడ్డారు. ప్రయాణీకులు ఇటువంటి వేడినీటి ని ఎలా తాగగలరని ప్రశ్నించారు. స్టేషన్లో ఉన్న ప్రయాణీకులను పలు వసతులపై ఆరా తీశారు. ప్రయాణీకులు సరిపడా బల్లలు లేక నిలబడి ఉండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ప్రాంగణంలో ఎప్పుడూ కనిపించని చెత్తబుట్టలు మంత్రి తనిఖీ సమయంలో దర్శనమివ్వడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరురూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర మేయర్ ఎన్.భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment