నేడు నెల్లూరు

Saturday, October 2, 2010

BSNL Dasara offers

దసరా పండుగను పురస్కరించుకుని బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు స్పెషల్ ఆఫర్లు అందిస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజరు జి గోపి తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆఫర్లు అక్టోబరు 7వ తేదీ నుంచి 17 వరకు ఉంటాయన్నారు. 3జి డేటా ప్లాన్ రూ. 2756 నుంచి రూ. 1499కు తగ్గించామన్నారు. 3జి పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ఛార్జీలు తగ్గించామని అన్నారు. గతంలో ల్యాండ్‌లైన్ ఉన్న వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షను కేవలం రూ. 499కే అందిస్తున్నామన్నారు. కొత్తగా తీసుకున్న వారికి కేవలం రూ. 625కే అందిస్తామని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు రూ. 2500 విలువచేసే డేటాకార్డు తీసుకుంటే 200 రూపాయలు విలువ చేసే సిమ్‌కార్డు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోపు బ్రాడ్‌బ్యాండ్ తీసుకున్న వారికి మొదటి 15రోజులు అన్‌లిమిటెడ్ ఉచితం, గేమ్స్ ఆన్ డిమాండ్, మ్యూజిక్ ఆన్ డిమాండ్ అందజేస్తున్నామన్నారు. గతంలో విల్‌ఫోన్ లైఫ్‌టైమ్ ప్లానుకి రూ. 200కు బదులుగా 49 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఎజిఎం మాలకొండారెడ్డికి బెస్ట్ పెర్ఫార్మింగ్ జెఎస్‌సి అవార్డును డిజిపి అరవింద్‌రావు చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. టాప్ అప్ రీఛార్జి, స్పెషల్ ఓచర్లుపై ఫుల్ టాక్‌టైం అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిజిఎం సిఎం జె శ్రీనివాసరావు, డిజిఎం ఫైనాన్స్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

No comments: