వైఎస్ మృతి చెందిన తర్వాత ఆయన తనయుడు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర పక్కదారి పట్టిందని మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి విమర్శించారు. మంగళవా రం ఆమె, మహబూబ్నగర్ జిల్లా పెబ్బే రు మండల కేంద్రంలో విలేకరులతో మా ట్లాడారు.అధిష్ఠానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేయడం జగన్కు మంచిది కాదని హితవు పలికారు.
అనవసర హం గామాతో చేస్తున్న యాత్ర ఓదార్పు కాదనీ, జగన్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ యాత్ర మృతుల కుటుంబాలకు పరామర్శలా లేదని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్లు ఉందన్నారు. ఇప్పటికైనా జగన్లో మార్పురావాలని ఆమె ఆకాంక్షించారు.
Wednesday, October 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment