నేడు నెల్లూరు

Friday, October 1, 2010

మంత్రి ‘ఆనం’ స్వగ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి భూమి పూజ

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి స్వగ్రామమైన చింతారెడ్డిపాళెంలో గురువారం సాయంత్రం దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమాన్ని స్థానిక నేతలు ఎంబేటి చినబాబు, పి.శ్రావణ్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ అకాల మరణంతో తాము కుటుంబ సభ్యుడిని కోల్పోయినబాధను అనుభవిస్తున్నామన్నారు. ఈ విగ్రహాన్ని యువనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదు ప్రారంభిస్తామన్నారు. అంతేకాక జిల్లాలో నిర్వహించే ఓదార్పు యాత్రను కూడా విజయవంతం చేస్తామని సృష్టం చేశారు. జగన్ కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు.

No comments: