Saturday, October 2, 2010
వెంకటగిరి పోలేరమ్మ జాతర హుండీ రాబడి
సెప్టెంబర్ 29,30 తేదిల్లో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం శుక్రవారం స్ధానిక ఆంజనేయస్వామి దేవస్థానంలో జరిగింది. ఈ హుండీ లెక్కింపు ద్వారా మొత్తం 5,46,488 రూపాయల రాబడి వచ్చినట్లు ఆలయ ఈవో రామచంద్రయ్య తెలిపారు. ఇందులో 30రూ దర్శన టిక్కెట్లు ద్వారా 1,40,590రూ, 100రూ ప్రత్యేక దర్శన టికెట్ల ద్వారా 42,400రూలు, దాతల విరాళాల ద్వారా 6,034 రూలు హుండి రాబడి 3,52,460 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో హుండీ రాబడితో పోలిస్తే ఈసారి హుండి రాబడి రెట్టింపుగా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ పులికృష్ణారెడ్డి, సభ్యులు జానకిరామయ్య, శ్రీహరికోట కృష్ణయ్య, మురళి పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment