గత ఎన్నికలకు ముందు వైఎస్ బజారురౌడీ అంటూ విమర్శనాస్త్రాలు గుప్పించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి మాటమార్చడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఎన్నికలైపోగానే సంపాదన కోసమే నీచమైన రాజకీయాలు చేస్తూ బజారు మనిషిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒకప్పుడు,ప్రజాధరణ పొందిన నాయకుడని చంద్రబాబుని పొగిడిన ప్రసన్న ప్రస్తుతం విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఒక్కొక్క లేఖకు ఎంత తీసుకుంటున్నావు. హోల్సేల్గా లేఖకు ఎంత పుచ్చుకుంటున్నావంటూ ధ్వజమెత్తారు.
1993లో దివంగత ఎన్టీఆర్ అప్పట్లో ప్రసన్నకు పార్టీ టికెట్టు ఇవ్వకపోతే స్వయంగా చంద్రబాబు ఎన్టీఆర్ను ఒప్పించి పార్టీ టికెట్ ఇప్పించారన్నారు. 2004-2009 లలో నూ చంద్రబాబు ఇచ్చిన టికెట్పై గెలిచారన్నారు. ఎనిమిదిన్నర నెలల పాటు మంత్రిగా పని చేసి ఏనాడు డీడీఆర్సీ, జిల్లా పరిషత్ మీటింగ్లలో పాఒ్గని ప్రజా సమస్యలను పరిష్కరించిన దా ఖలాలు లేవన్నారు. జిల్లా మంత్రిగా ఉండి ఆగస్టు 15న జెండా ఎగర వే యాల్సిన బాధ్యతను విస్మరించడంతో ఇన్చార్జి మంత్రి దేవేందర్ గౌడ్ చేత జెండా ఆవిష్కరణ చేయించుకోవాల్సి వచ్చిందన్నారు.
Sunday, October 10, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment