నేడు నెల్లూరు

Monday, October 11, 2010

రాజశేఖర్ రెడ్ది విగ్రహాలు రెండెనట ... జమిన్ రైతు పేపర్ తెగ బాధపడిపోతుంది ...

రాజశేఖర్ రెడ్ది విగ్రహాలు రెండెనట ... జమిన్ రైతు పేపర్ తెగ బాధపడిపోతుంది ... పేపర్ కటింగ్ చూడండి



స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మగాంధీ, రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు నెల్లూర్ లో ఎన్ని ఉన్నాయ్ ?


రాజశేఖర్ రెడ్ది విగ్రహాలు ఎన్ని పెట్టాలో ఏవిదంగా పెట్టాలో చెప్పవచు కదా ! ... క్రింద ఫోటో చూడండి ఇలా పెడితే జమీన్ రైతుకు సంతోషమా ....



చంద్రబాబునాయుడు మాటలు ఒకసారి చదవండి....

అనంతపురం :ఆయన స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్ముడా? బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచి సామాజిక న్యాయం కోసం రాజ్యాంగాన్ని రచించిన బీఆర్ అంబేద్కరా? ఏమి చేశారని వైఎస్ఆర్ విగ్రహాలను ఊరూరా పెడుతున్నారు? ఫ్యాక్షన్ నేతగా వందలాదిమందిని చంపించారు. రాష్ట్రాన్ని లూటీ చేసి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. అలాంటి దోపిడీ దొంగ విగ్రహాలను ఊరూరా పెడతారా? అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్ పాలకులపై ఆయన నిప్పులు చెరిగారు. "రాష్ట్రాన్ని వైఎస్ అడ్డంగా దోచుకున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఆయన విగ్రహాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. అందులోనూ నేతలకు అవినీతి జబ్బు పట్టుకుంది. అభిమానం ఉంటే ఇంటి పెరట్లోనో, తోటల్లోనో విగ్రహాలు పెట్టుకోండి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రహదారులపై ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తే సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తుతాయి.
అభిమానం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలే కానీ అది బలవంతంగా రుద్దితే వచ్చేది కాదు.

No comments: