కోటంరెడ్డిని సస్పెండ్ చేస్తూ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో మంగళవారం కోటంరెడ్డి అనుచరులు ఇందిరాభవన్ను ముట్టడించి తాళాలు వేశారు. రెండుగంటలపాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.అయినా ఎవరూ కూడా అడ్డుకోలేదు. కాంగ్రెస్ నేతలంతా మౌనం పాటించారు. బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో కోటంరెడ్డి పీసీసీ చీఫ్ డీఎస్ను గురి పెట్టి మాట్లాడారు. శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలతో ఇందిరాభవన్ను ముట్టడించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకుంటారో చూడాలన్న నిర్ణయంతో పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరిస్తున్నారు
. పీసీసీకి సవాల్ విసిరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపా టి చంద్రశేఖర్రెడ్డి, టీటీడీ మాజీ చైర్మ న్ భూమన కరుణాకర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి పీసీసీ చర్యలను తప్పుపట్టి ఘాటుగానే విమర్శలు సంధించారు. జగన్ వర్గీయులు గా ముద్రపడ్డ ముఖ్యనేతలంతా కోటంరెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారు.
Thursday, October 7, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment