నేడు నెల్లూరు

Sunday, October 10, 2010

నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కడుపున ప్రసన్న చెడపుట్టాడు : సోమిరెడ్గి

తెలుగుదేశం పార్టీ దయాదాక్షణ్యాల మీద ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ గుర్తుపై గెలిచి ప్రస్తుతం వైఎస్ జగన్ వద్ద పరువును తాకట్టు పెట్టాడని సోమిరెడ్గి విమర్శించారు. గతం లో నేదురుమల్లి కాళ్లు పట్టుకున్నారని, రాజ్యలక్ష్మి జపం చేసి జనార్ధన్‌రెడ్డి కొడుకు రామ్‌కుమార్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించి, ప్రస్తుతం జగన్ ప్రాపకం కోసం పాకులాడి డబ్బుకు దాసోహమనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలున్న స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పేరు, ప్రతిష్టలు దిగజారుస్తున్నారన్నారు.

కోవూరు నియోజకవర్గంలో శ్రీనివాసులురెడ్డి విగ్రహాలు పెడతామని ప్రకటించి ప్రస్తుతం వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఆయన చూపిస్తున్న ఆశక్తి వెనుక అక్రమార్జనే కారణమన్నారు. తెలుగు, ఇంగ్లీషు సరిగ్గా తెలియని ప్రసన్న సీఎల్పీ కార్యాలయానికి ఏదైనా లెటరు ఇవ్వాలంటే ఆ కార్యాలయం గుమస్తా రవిచంద్ర రాసిస్తారన్నారు. ఆ లెటరులో తన పేరును సరిగ్గా సంతకం చేయలేని పరిస్థితి ప్రసన్నదని ఎద్దేవా చేశారు. నీకు ఖలేజా, చీము, నెత్తురుంటే చంద్రబాబు ఇచ్చిన సీటుకు రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. జగన్, వైఎస్,సోనియా మరెవరైనా ఫోటోలు పెట్టుకుని పోటీ చేయాలన్నారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయతగల నాయకుడు పంచన చేరగానే వైఎస్ అకాల మృత్యువుకు గురయ్యారన్నారు. ముఖ్యమంత్రి కావాల్సిన జగన్ ప్రసన్న ఐరన్‌లెగ్‌వల్ల ఆదరణ కోల్పోయారన్నారు.

No comments: