నేడు నెల్లూరు

Monday, October 4, 2010

నెల్లూరు జిల్లాలో వైఎస్‌కు ఆలయం

రాష్ట్రంలో ఒకవైపు వైఎస్ విగ్రహాల జాతర సాగుతుండగా నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏకంగా ఆ యనకు ఆలయం నిర్మిస్తున్నారు. రాజీవ్ పల్లెబాటలో భాగంగా లోగడ వైఎస్ ఈ గ్రామానికి వచ్చారు. అప్పుడు వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశా రు.

ఇందులో పాఠశాల అదనపు భవనాల కోసం చేసిన విజ్ఞప్తిపై ఆయన తక్షణం స్పందించారు. రూ.12 లక్షలు విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామస్థులతో సహపంక్తి భోజనంచేసి, రాత్రి అక్కడే బసచేశారు. అటుపైన పేదలకు 400 పక్కాఇళ్లు, 500 మందికి పింఛన్ మంజూరు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్న గ్రామస్థులు ఇప్పుడు ఆలయం నిర్మిస్తున్నారు.

No comments: