నేడు నెల్లూరు

Sunday, October 10, 2010

1995లో లక్ష్మీ పార్వతి పంచన చేరిన ప్రసన్న : బీద రవిచంద్ర

తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ అవినీతి పరుడైన ప్రసన్నకుమార్‌రెడ్డికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. 1993లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడివా అని ప్రశ్నించారు. 1995లో లక్ష్మీ పార్వతి పంచన చేరి పది రోజుల్లో చంద్రబాబు కాళ్లు పట్టుకుని పార్టీలో చేర లేదా...? అంటూ విమర్శించారు. జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదరణతోనే ప్రసన్న నియోజకవర్గంలో గెలిచారన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు

. జగన్ ఇచ్చిన డబ్బుతో ఓదార్పు యాత్రకు పోస్టర్లను ప్రసన్న ఏర్పాటు చేశారని విమర్శించారు. టీడీపీ నగర అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసి అర్హత నీకెం ఉందంటూ వైఎస్ఆర్ అభిమానులు ప్రసన్నను ఓ మీటింగ్‌లో నిలదీశారన్నారు. ఆడా, మగ కాకుండా మారారని ప్రసన్నను ఎద్దేవా చేశారు. తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు బీద రవికుమార్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు సాయం కోసం పడిగాపులు కాసి తీరా సాయం పొందిన తర్వాత చంద్రబాబును లేఖాస్త్రాలతో విమర్శించడం సిగ్గుచేటన్నారు

త్వరలో తగిన బుద్ధి చెబుతామని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

No comments: