అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెలే ్య ఆదాల ప్రభాకర్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఆధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం వెంకటాచలం మండలం అబ్బిసాహెబ్కండ్రిగలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ముత్తుకూరులో రిలయన్స్ కంపెనీని బెదిరించి రోడ్డు నిర్మాణంలో రూ.5 కోట్లు దోచుకున్నారన్నారు.
ఎర్రగుంట వద్ద ఏవీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో 14 ఎకరాల భూమిలో గ్రావెల్ తవ్వుకుని వారిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పోర్టు రహదారి, జాతీయరహదారి మధ్య ఉన్న 8 ఎకరాల భూమిని, ఇడిమేపల్లి సప్లయి ఛానెల్ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రైతుల పంటకాల్వను పూడ్చేస్తున్నా కలెక్టర్ కె.రాంగోపాల్, ఇరిగేషన్ అధికారులు నిద్రపోతు న్నారా అని ఆయన ప్రశ్నించారు.
పంటకాలువను యథావిధిగా ఉంచకపోతే అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
Saturday, October 9, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment