నేడు నెల్లూరు

Tuesday, May 17, 2011

రోజాపై కొత్త వదంతులు


ప్రముఖ సినీ నటీ రోజాపై అప్పుడే కొత్త వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి.రోజా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారా?అంటూ ఒక ఛానల్ హడావుడి చేసింది. దానికి కారణం ఏమిటంటే ఆ పార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన నలభై ఎనిమిది గంటల నిరాహారదీక్షకు రోజా వెళ్లకపోవడమే ఈ వదంతులకు ఆదారంగా ప్రసారం చేశారు. ప్రముఖ సినీ నటులు జీవిత,రాజశేఖర్ ల దారిలోనే ఆమె కూడా వెళతారా అంటూ కధనాలు ఇచ్చారు. రోజా గుంటూరు వెళ్లని మాట నిజమే . కాని అంతామాత్రాన
ఆమె తమకు దూరం అయిపోయినట్లేనని ఎలా అంటారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.రోజాకు వ్యక్తిగత పనులు ఉండడం వల్ల ఆమెకు వెళ్లి ఉండకపోవచ్చని వారు అంటున్నారు. అంటే జగన్ కావాలని సినిమా నటులను దూరంగా ఉంచదలిచారా అన్నది ఈ కధన సారాంశం. సినీగ్లామర్ కన్నా తన గ్లామరే పెద్దదని ఆయన చెప్పదలిచారన్నది వారి ఉద్దేశం కావచ్చు. అయితే జగన్ ప్రస్తుతం ఎవరి గ్లామన్ మీద ఆధారపడవలసిన పరిస్థితిలో లేరన్నది కూడా వాస్తవం. ఏది ఏమైనా ఎవరైనా ప్రముఖులు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కాలేదంటే కచ్చితంగా అదే వార్తే అవుతుంది.అయితే హాజరు కానంతమాత్రాన అధారం ఉంటే తప్ప వారు పూర్తిగా దూరం అయినట్లు అనుకోనవసరం లేదు. ఇంతకీ ఈ హడావుడి చేసిందంతా జగన్ కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్న ఒక ఛానల్ కాబట్టి దానిని సీరియస్ గా తీసుకోనవసరం లేదన్నది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాల వాదనగా ఉంది.

No comments: