నేడు నెల్లూరు

Monday, May 30, 2011

సత్యసాయిబాబా మందిరంలో ఏమున్నాయో

సత్యసాయిబాబా ట్రస్టు వ్యవహారాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సాయిబాబ చనిపోవడానికి ముందువరకు ఆయన ఉండే యజుర్వేద మందిరంలో విశేషమైన సంపద ఉందన్న వార్తల నేపధ్యంలో ఆ మందిరాన్ని తెరవడానికి ట్రస్టు బోర్డు సభ్యులు కొందరు ప్రయత్నిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి.సాయిబాబని ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఆ మందిరాన్ని మూసి ఉంచారు. ఆ మందిరంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు. నగదు మొదలైనవిపెద్ద ఎత్తున ఉన్నాయని అంటున్నారు. అయితే కొందరు వీటిపై కన్ను వేశారని,రెవెన్యూ, పోలీసు అధికారులతో నిమిత్తం లేకుండా యజుర్వేద మందిరాన్ని తెరవాలన్న ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక పోలీసు మాజీ ఉన్నతాధికారి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి, పోలీసు భద్రత లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. వీరికి కొందరు ట్రస్టు బోర్డు సభ్యులు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి యజుర్వేద మందిరం వద్ద పోలీసు కాపలా యధాతధంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయాలలో ట్రస్టు బోర్డు సభ్యులు ముందుకు వచ్చి, వాస్తవ పరిస్థిని తెలియచెప్పి, ప్రభుత్వ ప్రతినిధులు, మధ్యవర్తుల సమక్షంలో యజుర్వేద మందిరాన్ని తెరిచి ఉన్న విలువైన వస్తువులన్నిటీని రిజిస్టర్ చేస్తే మంచిది కదా. అప్పుడు అనవసరమైన వదంతులకు ఆస్కారం ఉండదు కదా.

No comments: