నేడు నెల్లూరు

Monday, May 30, 2011

కిరణ్‌పై నేదురుమల్లి పిడుగు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై రాజకీయంగా మరో బాంబు పడింది.మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఏకంగా సి.ఎమ్.పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. అంతేకాక ఆయన ఎ.ఐ.సిసి అధినేత్రి సోనియాగాందీకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఎవరిని సంప్రదించే సంప్రదాయం లేదని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, పరిస్థితిని చక్కదిద్దాలని సోనియాకు చెప్పానని ఆయన బహిరంగంగా వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయిన నేదురుమల్లి జనార్దనరెడ్డిని ఈ మధ్య కాలంలో కిరణ్ అసలు పట్టించుకోవడం లేదు. కనీసం ముఖ్యమంత్రి అయ్యాక సీనియర్ నాయకుడిగా ఉన్న నేదురుమల్లిని కిరణ్ కలవడానికి కూడా ప్రయత్నించినట్లు లేరు. ఈ నేపధ్యంలో కిరణ్ పై రాజకీయంగా తనదైన శైలిలో ఆయన విమర్శల వర్షం కురిపించారు. దానికి తోడు కడప ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయిన తీరును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించి ఉంటారు.ఏది ఏమైనా నేదురుమల్లి పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతారన్నది పక్కన బెడితే , పార్టీలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సీనియర్ నాయకుడు .1972 లోనే కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయి రాష్ట్ర మంత్రి అయ్యారు.రాష్ట్రస్థాయిలో చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డిలకు వ్యతిరేకంగా చాలాకాలం ఒక వర్గాన్ని నడిపిన నేతగా గుర్తింపు పొందారు. ఇటీవలి కాలంలో ఆరోగ్య రీత్యా కొంత వెనుకబడినప్పటికీ , రాజకీయంగా ఆయన దగ్గర వర్గం తగ్గినప్పటికీ, ఆయనకు ప్రత్యేక
గుర్తింపు కాంగ్రెస్ లో ఉంటుంది. అలాంటి వ్యక్తిని కిరణ్ కుమార్ రెడ్డి అసలు పట్టించుకున్నట్లు కనబడలేదు. దానిఇని దృష్టిలో ఉంచుకునే నేదురుమల్లి కిరణ్ నెత్తిన ఒక రాయిపెట్టి కొట్టినట్లు మాట్లాడారు.

No comments: