నేడు నెల్లూరు

Tuesday, May 24, 2011

చిరంజీవి ఏ ముహూర్తాన రాజకీయాలలోకి వచ్చారో

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఏ ముహూర్తాన రాజకీయాలలోకి వచ్చారో కాని , ఆ రోజు నుంచి ఆయన కష్టాలు పడుతూనే ఉన్నారు.మొదట ఆయన రాజకీయాలలోకి వస్తారా?రారా అన్న సస్పెన్స్ సాగింది.ఆ తర్వాత రాజకీయాలలో ఎలా రాణిస్తారన్న చర్చ,తదనంతరం టిక్కట్ల గోల, రకరకాల ఆరోపణలు,ఎన్నికల ప్రచారంలో అంతా రకరకాల ఆరోపణలు, ఎన్నడూ ఊహించని విమర్శలు.. వాటిని తట్టుకుని నిలబడితే బాక్సాపీస్ దగ్గర బోల్తా పడిన సినిమా మాదిరి దెబ్బతిని కేవలం పద్దెనిమిది సీట్లే వచ్చాయి.ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలన్న నిర్ణయం , అదేదో వేగంగా సాగుతుందనుకుంటే ఇప్పుడు మళ్లీ సస్పెన్స్. అప్పుడే కాంగ్రెస్ లో విలీనం చేయాలని తీర్మానం చేసి మూడు నెలలు అయినా ఇంకా ఎన్నికల కమిషన్ ఇంకా పరిశీలిస్తూనే ఉంది.ఈలోగా ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఉండి జగన్ వర్గంలోకి వెళ్లిన శోభానాగిరెడ్డి ఈ విలీనం చెల్లదంటూ ఎన్నికల సంఘానికి, ఉప సభాపతికి ఫిర్యాదు చేశారు. అంతేకాక ప్రకాశం జిల్లా కు చెందిన లక్ష్మ య్య నాయుడు అనే వ్యక్తి ఏకంగా విలీనంపై కోర్టుకు ఎక్కారు. ఈయన వల్ల లక్షల నష్టం జరిగిందన్న అబియోగం మోపారు.ఇవి చాలవన్నట్లుగా తెలంగాణ తీర్మానంలో చిరంజీవి పార్టీ మార్పుచేసుకున్నందునే తెలంగాణ లోఆత్మహత్యలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదు.చాలా చిత్రమైన రాజకీయం అనిపించి ఉండాలి చిరంజీవికి.వీటన్నిటిని భరించి, కేంద్రంలో మంత్రి పదవి చేద్దామంటే విలీనం అయ్యేదెప్పుడో అర్దం కావడం లేదట.ఇదే విషయాన్ని చిరంజీవిని కొందరు ప్రశ్నిస్తే, తనకే తెలియడం లేదు అని నిట్టూర్చారట.నిజమే రాజకీయం అంటే తెలియని చిరంజీవికి ఇవన్ని చిక్కులు,చికాకులే.

No comments: