నేడు నెల్లూరు

Tuesday, May 24, 2011

లోకేష్ కు పోటీగా జూనియర్ ఎన్.టి.ఆర్

తెలుగుదేశం పార్టీలో మళ్లీ లోకేష్, జూనియర్ ఎన్.టి.ఆర్ ల లొల్లి కొనసాగేలా కనిపిస్తోంది.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ను చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలన్న డిమాండుకు పోటీగా జూనియర్ ఎన్.టి ఆర్.ను కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం ఇన్ ఛార్జీగా నియమించాలని ఎన్.టి.ఆర్.మద్దతుదారులు డిమాండు చేయబోతున్నారట.కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జరగనున్నజిల్లా పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయాలని ఎన్.టి.ఆర్ మద్దతుదారులు పట్టబట్టబోతున్నారని
ప్రచారం జరుగుతోంది.కొద్ది కాలం క్రితం నారా లోకేష్ టిడిపిలో చంద్రబాబు వారసుడు అవుతారన్ని వచ్చిన కధనాలపై జూనియర్ ఎన్.టి.ఆర్ తరపున కూడా ఆయనే వారసుడన్న ప్రచారం చేయడం జరిగింది. పార్టీలో ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే చంద్రబాబు గట్టిగా వ్యవహరించడంతో జూనియర్ ఎన్.టి.ఆర్, ఆయన తండ్రి హరికృష్ణ లు కొంచెం తగ్గారు. అయినప్పటికీ లోలోపల దీనిపై మధనం జరుగుతోంది.ఈ సమయంలో లోకేష్ ను చంద్రగిరి ఇన్ఛార్జి అంటూ వార్తలు రావడంతో వెంటనే జూనియర్ ఎన్.టి.ఆర్ మద్దతుదారులు రంగంలో దిగడం ద్వారా వారసత్వ పోరునుకొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అర్ధం అవుతుంది.అయితే చంద్రబాబు మాత్రం లోకేష్ పై తీర్మానం చేయడంపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే చంద్రబాబుకు తెలియకుండా అలాంటి తీర్మాం చేస్తారా అన్న వాదన కూడా ఉంది.అయితే భవిష్యత్తులో యువనేతల మధ్య రాజకీయ ఘర్షణ జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది

No comments: