నేడు నెల్లూరు

Friday, May 20, 2011

ముఖ్యమంత్రిపై వేటు వేయాలంటున్న మంత్రులెవరు?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులపై ఎదురుదాడి చేస్తున్నారా? పలువురు మంత్రులు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ ను కలిసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. తమతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరపడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని,తమ అప్రాధాన్య శాఖలను మార్చలేదని ఆయా మంత్రులు ఆరోపణలు చేశారు. దీనిపై అజాద్ ముఖ్యమంత్రి కిరణ్ తో మాట్లాడారు. ఆ సందర్భంగా కొందరు మంత్రులు తనకు సహకరించడం లేదని , క్యాబినెట్ విషయాలను కూడా లీక్ చేస్తున్నారని ఆరోపించారు. కోస్తాకు చెందిన ఇద్దరు మంత్రులను తొలగించాలని , అందుకు తనకు అనుమతి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా గులాం నబీ అజాద్ ను కోరినట్లు కధనాలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రులు అన్న ఆరా తీస్తే ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.ఒకరు బొత్స సత్యనారాయణ. ఈయన విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి శాఖల కేటాయింపు జరపగానే తిరుగుబాటు చేసి ఆయనను నైతికంగా దెబ్బతీశారన్న అభిప్రాయం ఉంది.అంతేకాక, ఆయా సందర్బాలలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని సి.ఎమ్. భావిస్తున్నారు. కొద్ది రోజులు క్రితం విలేకరుల సమావేశం పెట్టి ముఖ్యమంత్రి కూడా కడప ఓటమికి బాధ్యత వహించాలన్నట్లుగా మాట్లాడారు. ఇక మరో మంత్రి వట్టి వసంతకుమార్ పేరు చెబుతున్నారు. ఆయన కూడా కిరణ్ కు వ్యతిరేకంగా శిబిరం నడిపి మంత్రి పదవి కూడా కొన్నాళ్ల పాటు తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు. వీరిద్దరిని తొలగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

No comments: