నేడు నెల్లూరు

Monday, May 16, 2011

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా?వస్తున్న కధనాల ప్రకారం చూస్తే రాష్ట్ర మంత్రులు పలువురు ఆయన ధోరణి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా సోమవారం వస్తున్న గులాం నబీ అజాద్ వద్ద కిరణ్ కుమార్ రెడ్డి కి వ్యతరేకంగా గట్టిగా మాట్లాడబోతున్నారు. కాగా ఛీఫ్ విప్ భట్టి విక్రమార్క ప్రకటించినదాని ప్రకారం అజాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్.పిలతో ఒక్కక్కరితో విడి,విడి గా మాట్లాడారని చెప్పారు. సాధారణంగా అబిఫ్రాయ సేకరణ జరపదలచినప్పుడే ఇలా చేస్తారు.దీనిని బట్టి అజాద్ ముఖ్యమంత్రి పనితీరుపై ఒక అంచనాకు రావడానికి, అవసరమైతే మార్చాలా?వద్దా అన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ బేటీని వాడుకుంటారని, అందరి అభిప్రయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.అందుకే రెండు రోజుల పాటు ఇక్కడే మకాం చేస్తున్నారు.కాగా మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవీబాధ్యతలు చెప్పటిన తొలిరోజే తిరుగుబాటు చేసినా అప్పట్లోసర్ది చెప్పారు. కాని వారి శాఖలు మార్చలేదు.ఆ అసంతృప్తి రగులుతోంది. అన్నిటికి మించి కిరణ్ చాలామంది కన్నా జూనియర్ . ఆ భావన చాలామందిలో ఉంది. ఆయన పెద్దగా ఎవరిని కలుపుకుని వెళ్లడం లేదని, తనకు అన్నితెలుసు అన్నట్లు వ్యవహరిస్తారనేది అందరి ఫిర్యాదు. ఇక అధిష్టానం కూడా అప్పట్టో ఎవరి అబిప్రాయం తీసుకోకుడానే నేరుగా కిరణ్ ను నియమించింది. అది జరిగి అప్పుడే ఆరునెలలు అవుతుంది. ఈ ఆరునెలల్లో పార్టీపై,ఎమ్మెల్యేలపై, ప్రభుత్వంపై ఏ మా్త్రం పట్టు సాధించారన్నది స్వయంగా అజాద్ పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డికి ఒక పరీక్ష రోజు కింద లెక్క. ఎంతమంది ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కిరణ్ కు అనుకూలంగా చెబుతారన్నది ఒక ప్రశ్న. ఇక ఎమ్.పిలు చాలామంది కిరణ్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. వారి మనోగతం కూడా అజాద్ తెలుసుకోవచ్చు.అలాగే తెలంగాణ అంశంపై అదిష్టానం భావన తెలిపి, తెలంగాణ నేతల అబిప్రాయాలను సేకరించే అవకాశం ఉంది.

No comments: