నేడు నెల్లూరు

Monday, May 23, 2011

యువతిపై సామూహిక అత్యాచారం

కావలి : ఓ యు వతిపై కావలి పీజీ సెంటర్ సమీపంలోని జామాయిల్ తో టల్లో ముగ్గురు యువకులు సామూహి క అత్యాచారం చేశారు. పోలీసుల కథ నం మేరకు .. కలిగిరికి చెందిన ఆ యు వతి కొండాపురం మండలం రేణమాల కు చెందిన గూడూరు రమేష్‌తో ప్రేమలో పడింది. శనివారం ఇద్దరూ కావలి కి చేరుకొని పెదపవని రోడ్డు మీదుగా జామాయిల్ తోటల్లోకి షికారుకెళ్లారు. పెదపవని రోడ్డుకు చెందిన కాకనాటి తి రుపతి, సాదా సురేష్, పుల్లా కుమార్‌రాజా అనే యువకులు వీరిద్దరినీ గమనించారు. జామాయిల్ తోటల్లోకి వెళ్లి వారికి మా యమాటలు చెప్పి బ్యాగుతీసు కున్నారు.

ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లిపోయా రు. సాయంత్రం ఆ యువతి బ్యా గులో బంగారం, నగదు మాయమవడాన్ని గమనించింది. ఆ ముగ్గురు యు వకులకు ఫోన్ చేయగా అక్కడే జామాయిల్ తోటల్లో పడి ఉంటాయి వెళ్లి వె దుక్కోమని చెప్పారు. ఆ యువతి ప్రి యుడితో కలసి రాత్రివేళ జామాయిల్ తోటలో వెదుకులాడుతుండగా ముగ్గు రు యువకులు వచ్చి రమేష్‌పై దాడి చేశారు. అతడు పారిపోయాడు. అనంతరం ఆ ముగ్గురూ యు వతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. రమేష్ తన స్నేహితులతో వచ్చి నిందితులలో ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments: