నేడు నెల్లూరు

Friday, May 20, 2011

2014 వరకు కిరణ్ ను ఉండనిస్తారా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2014 వరకు కొనసాగుతుందా?ఆయనను మార్చే అవకాశం లేదా? మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంత హడావుడి
చేయడం ఎందుకు? అందరి అబిప్రాయాలు తీసుకోవడం ఎందుకు?కేంద్రమంత్రి , రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ గులాం నబీ అజాద్ జరిపిన రెండు రోజుల పర్యటనలో కిరణ్ గురించి
కాని, కిరణ్ ప్రభుత్వం గురించి కాని సానుకూలంగా చెప్పిన వారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయినప్పటికీ ఇప్పట్లో కిరణ్ ను మార్చలేమని గులాం నబీ అజాద్ అన్నట్లు కధనాలు వస్తున్నాయి.అంటే దీనర్ధం ఇంకోరకంగా కూడా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణ ఇవ్వనట్లేనా అన్నది కొందరి అనుమానం.అయితే రాజకీయాలు
ఎప్పుడూ ఒకేరకంగా ఉండవు.నిత్య చైతన్యంగా ఉంటాయి. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.కిరణ్ప్రభుత్వంపై ఇంత అసంతృప్తి ఉందా అని తెలుసుకుని అజాద్
ఆశ్చర్యపోయారట.ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కిరణ్ వైఖరిలో మార్పు తీసుకు వస్తానని అంటున్నారట. అది సాధ్యమయ్యేపనేనా? రాజకీయాలలో
ఒకసారి అంతరం ఏర్పడితే, అది ఏదో రూపంలోబయటపడుతూనే ఉంటుంది.ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రి కి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయి.వాటిని సర్దుబాటు
చేసుకోలేదు. ఎమ్మెల్యేలు కిరణ్ నియంత్రణలో లేరు. వారిని సమన్వయపరచుకోవలి.పార్టీ యంత్రాంగం గురించి దాదాపు తెలియని స్థితి ఉంది. వీటన్నటిని సరిచేసుకుని
ముందుకు వెళ్లడం అంత తేలికకాదు. నిజంగానే కిరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళితే బాగానే ఉంటుంది. బహుశా ఇందుకోసం కిరణ్ కు కొంత సమయం ఇవ్వవచ్చు. నిర్దిష్ట
గడువులోగా వైఖరి మార్చుకుని పార్టీ పరిస్థితిని మెరుగుపరచకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వస్తుందని హెచ్చరించవచ్చు. అప్పటికి సెట్ రైట్ అయితే ఒకే.
లేకుంటే మాత్రం కిరణ్ ను మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కనుక కొన్నిపత్రికలలో వచ్చినట్లు కిరణ్ ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వడం కాదు. అది రివర్స్
అవడానికి కూడా ఎంత సమయం పట్టదు. కనుక 2014 వరకు కిరణ్ ఉంటారని గులాం నబీ సంకేతాన్ని ఇచ్చినా, అదంతా ఆయన చేతిలో కూడా లేదు. తెలంగాణ అంశం, కిరణ్
వ్యవహార శైలి, ప్రభుత్వ సమర్ధతపై ఆధారపడే ఆయన ప్రభుత్వ మనుగడ ఉంటుంది

No comments: