నేడు నెల్లూరు

Sunday, May 29, 2011

మేకపాటి క్వారీ గోవిందా!


నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకుల మధ్య రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతోంది.రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి,ఆయన పోదరుడు వివేకానందరెడ్డిలకు, వైఎస్.ఆర్.కాంగ్రెస్ కు మద్దతుదారులుగా ఉన్న మేకపాటి సోదరులకు మధ్య తీవ్ర స్థాయిలో వివాదం ఏర్పడింది. ఈ రెండు వర్గాలు రాజీనామాల సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. ఈ దశలో మేకపాటి రాజమోహన్ రెడ్డికి చెందిన కెఎమ్ సి కి మంజూరైన కంకర క్యారీని రద్దు చేసే విషయమై కూడా యోచన జరుగుతోంది.నెల్లూరు ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రముఖ కాంట్రాక్టరు కూడా. ఆయన కంపెనీకి, మరో కంపెనీకి కలిపి జాతీయ రహదారి విస్తరణ కాంట్రాక్టు లభించింది. ఆ పని చేయడానికి అవసరమైన కంకరను
తీసుకురావడానికి ఒక క్వారీని మేకపాటి కంపెనీ లీజుకు తీసుకోడానికి గాను దరఖాస్తు చేసుకుంది.మొదట దానిపై కొంత వ్యతిరేకత వచ్చినా, తదుపరి స్థానిక అదికారులు పాజిటివ్ గా నివేదిక ఇవ్వడంతో క్వారీ మంజూరైంది. అయితే ఇంతలో మంత్రి ఆనం సోదరులకు, మేకపాటి సోదరులకు రాజకీయ వివాదం ముదరడంతో మంత్రి కి ఈ క్వారీ విషయం గురించి తెలిపారు. దానిపై ఆరా తీసి వాస్తవ పరిస్థితి తెలుసుకోవలసిందిగా మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇంతకు ముందు కలెక్టర్ రాంగోపాల్ ఈ క్వారీని మంజూరు చేశారు. అయితే తాజాగా ఆ క్వారీని స్తానికులు వ్యతిరేకిస్తున్నారన్న కారణంగా గత కలెక్టర్ మంజూరు చేసిన లీజును ప్రస్తుత కలెక్టర్ శ్రీధర్ పెండింగులో ఉంచారట. ఇదంతా మంత్రి రామనారాయణరెడ్డిని సంతోషపెట్టేందేకునేనని మేకపాటి వర్గీయులు అంటున్నారు. ఈ సోదరుల ద్వయాల మధ్య మున్ముందు రాజకీయ వివాదం ఎటు మలుపు తిరుగుతుందా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

No comments: