
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఏడు సార్లు లోక్ సభకు ఎన్నికైన జి.వెంకటస్వామి అస్వస్థతకు గురయ్యారు.ఎనభై ఏళ్లకు పైగా వయసు ఉన్న వెంకటస్వామి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, బిపి పెరిగిందని చెబుతున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలిచి వైద్య చికిత్సలందిస్తున్నారు. ఆయన కుమారుడు వివేక్ పెద్దపల్లి ఎమ్.పిగా ఉండగా, మరో కుమారుడు వినోద్ గత రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.ఇటీవలి కాలంలో సోనియాగాంధీ పై విమర్శలు కురిపించి సంచలనం సృష్టించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రయత్నం చేసే నేతగా గుర్తింపు పొందారు.
No comments:
Post a Comment