నేడు నెల్లూరు

Monday, May 30, 2011

హరికృష్ణకు, లక్ష్మీపార్వతి కు చంద్రబాబు జవాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణకు, ఎన్.టి.ఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కి ఘాటైన సమాధానం చెప్పారు. వారిద్దరిపేర్లు చెప్పకపోయినా వారు చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయన తన మహానాడు ముగింపు ఉపన్యాసంలో ఆయా అంశాలాను ప్రస్తావించారు. ఎన్.టిఆర్ ను ఎదిరించడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఆరోజు ఎదురు తిరిగాం కనుకే ఈరోజు ఎన్.టి.ఆర్ విధానాలను కొనసాగించగలుగుతున్నామని అన్నారు. అలాగే హరికృష్ణకు సమాధానం చెబుతూ కుటుంబం వేరు,రాజకీయం వేరు ఆయన స్పష్టం చేశారు.ఆయన చేసిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

\"ఎన్.టిఆర్ ను ఆరాధ్య దైవంగా చూశాను ఆయన అంటే ఎక్కడ లేని అబిమానం.గురుత్వం. అనుకుంటే పట్టుదల తో సాధించే లక్ష్యం ఆయనది ఎలాంటి కష్టాలను అయినా ఎదుర్కునే మనస్తత్వం ఆయనది. తెల్లవారుజామున నాలుగు గంటలకు నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫోన్ వస్తుందని భయపడి ముందుగానే తయారై వెళ్లేవాడిని. నేనెన్నడూ ఎన్.టి.ఆర్ పై తిరుగుబాటు చేస్తానని అనుకోలేదు.
కాని అనుకోకుండా ఆయన జీవితంలోకి దుష్టశక్తి ప్రవేశించింది. లేనిపోనివి చెప్పి పార్టీని నాశనం చేస్తుంటే అందరం అడ్డుకోవడానికి ప్రయత్నించాం. ఎన్నో ప్రయత్నాలు చేశాం.కాని సాధ్యపడలేదు. తప్పనిపరిస్థితిలో ఎదురు తిరగవలసి వచ్చింది.ఆనాడు రెండువందలమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు.ప్రజాస్వామ్యబద్దంగా తిరుగుబాటు జరిగింది. ఈరోజు ఎన్.టిఆర్ విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లగలుగుతున్నామంటే ఆరోజు తిరుగుబాటు చేయగలిగాం కాబట్టే.ఈ పార్టీని అంతం చేయాలని కొందరు చూస్తున్నారు.వారిమీద పోరాడుతున్నాంకుటుంబం వేరు. బంధుత్వం వేరు,రాజకీయం వేరు అన్నది నా ఆలోచన . భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ ఉంది. అమెరికాలో కాంట్రాక్టు పెళ్ళిళ్లు జరుగుతాయి. మన దేశంలో మాత్రమే కలిసి ఉండే కుటుంబాలు ఉంటాయి. అమెరికాలో పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ఇంటిలో ఉండరు. కాని మన దేశంలో మాత్రమే పిల్లలు,పెద్దలు అంతా కలిసి ఉండే వ్యవస్థ ఉంది. సమస్యలపై పోరాడుతున్నాను. ఎవరిపై నాకు వ్యతిరేకత లేదు.నేను కాంగ్రె స్ తో లాలూచి పడలేదు. వీరోచితంగా పోరాడాం.1989-1994మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులతో పోరాడం. అలాగే వై.ఎస్.పై పోరాడం. రెండువందల మంది కార్యకర్తలను హత్యచేశారు.దానిపై పోరాడం. నేను అదికారంలో ఉన్నప్పుడుఎవరికి లైసెన్సులు ఇప్పించుకోలేదు.కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు చేయాలి.కాని పార్టీ ని ముందుకు తీసుకువెళ్లాలి . ఆ ప్రకారం చేస్తాను .రాజకీయాలు వేరు,కుటుంబం వేరు,బంధుత్వం వేరు, నా భార్యకాని,కొడుకు కాని జోక్యం చేసుకోలేదు. మేము కొన్ని నియమనిబంధనలు పెట్టుకున్నాం.క్రమశిక్షణ గాఉన్నాం.పిల్లలను మంచి చదువు చెప్పించాం. చంద్రగిరిలో మా అబ్బాయి గురించి ఫ్లెక్సీలు పెడితే కోప్పడ్డాను.మనం రాజకీయాలు చేయడం మంచిదికాదని మందలించాను.రాజకీయాలలోకి రానివారిపై పోస్టర్లు వేసి ఇబ్బంది పెట్టవద్దు. మాది పెద్ద కుటుంబం. బంధుత్వం వేరు.రాజకీయాలు వేరు. పార్టీని కాపాడుకోవాలసిన కర్తవ్యం నామీద ఉంది.అందువల్ల ఏమి చేయాలో చేస్తాను.\'అని చంద్రబాబు ఉద్వేగభరితంగా ఉపన్యసించారు.

No comments: