నేడు నెల్లూరు

Saturday, May 28, 2011

జూనియర్ ఎన్.టి.ఆర్ వైఖరి ఇదేనా!

ప్రముఖ సినీనటుడు , రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కుమారుడు అయిన జూనియర్ ఎన్.టి.ఆర్ మహానాడుకు హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆయన, తన తండ్రి హరికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లతో కలిసి నెక్లస్ రోడ్లోని ఎన్.టి.ఆర్.ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా సాధారణంగా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుని విబేదాలు లేవని కార్యకర్తలకు, ప్రజలకు ఒక సందేశం, ఒక సంకేతం ఇవ్వడానికి రాజకీయ నేతలు ప్రయత్నిస్తుంటారు.అయితే హరికృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్లు చంద్రబాబుతో కలిసి నివాళులర్పించకపోవడమే కాక,
విడిగా రావడం, తర్వాత తాను మహానాడు కు వెళ్లడం లేదని ప్రకటించడం అనేక సందేహాలకు తావిస్తోంది . తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు కొత్త దశకు చేరుకుందన్న అబిప్రాయం కలుగుతుంది. తాను షూటింగ్ లలో బిజీగా ఉన్నందున మహానాడుకు వెళ్లడం లేదని, వచ్చే మహానాడుకు వెళతానని ఎన్.టి.ఆర్ చెప్పారు. స్వయంగా చంద్రబాబో, లేక ఎర్రన్నాయుడో ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్లకపోవడంలోని ఆంతర్యం అర్ధం చేసుకోవడం కష్టం కాదు.ఎందుకంటే మహానాడు జరుగుతున్న గండిపేట కు అరగంట ప్రయాణం .ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు మూడురోజులపాటు జరిగే మహానాడుకు వెళ్లడానికి టైమ్ సరిపోవడం లేదని అంటే అది నమ్మశక్యం కాదు. తన ప్రాముఖ్యతనుపార్టీలో పెంచుకోవడానికి,చంద్రబాబు నాయుడుకు చికాకు కలిగించడానికి, నారా లోకేష్ కన్నా తనకే ప్రజాదరణ ఉందని , కార్యకర్తలలో పలుకుబడి ఉందని రుజువు చేసుకోవడానికి
జూనియర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబుకు , హరికృష్ణ కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందని మరోసారి ఈ సన్నివేశం తేల్చి చెప్పింది.

No comments: