నేడు నెల్లూరు

Friday, May 20, 2011

కరుణానిధికి అస్వస్థత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆకస్మికంగా అస్వస్థులయ్యారు. 2జి కేసులో తన కుమార్తె కనిమొళి అరెస్టు అయ్యారన్న సమాచారం విన్న తర్వాత కరుణానిది అస్వస్థతకు గురి అయ్యారు.ఆయన చెంత స్టాలిన్, ఆర్కాట్ వీరాస్వామి, అన్బళగన్ ప్రభృతులు ఉన్నారు.కరుణానిదికి ఆయన వ్యక్తిగత వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా అరెస్టయిన కనిమొళిని, కళైంగర్ టీవీ ఎమ్.డి శరత్ కుమార్ లను తీహారు జైలుకు తరలించారు.88ఏళ్ల వయసులో కరుణానిధికి ఈ కష్టం వస్తుందని ఎవరూ ఊహించలేదు. గత పదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చలాయించిన కరుణానిధి సొంత కుటుంబ సభ్యులే ఈ రకంగా జైలు పాలవుతారని ఎవరూ అనుకోలేదు.తన డబ్బై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని కరుణానిధి ఎదుర్కుంటున్నారు.ఒక పక్క అధికారాన్ని కోల్పోయి బాధలోఉంటే ఇప్పుడు తన కుమార్తె కనిమొళి అరెస్టు కావడం దెబ్బమీద దెబ్బగా మారింది.కాగా తాజా పరిణామాలపై డి.ఎమ్.కె. సీనియర్ నేతలు సమీక్షించుకుంటున్నారు.కాగా కేంద్ర మంత్రి, కరుణానిధి కుమారుడు అళగిరి పై కూడా కేసు పెట్టే విషయంపై అన్నాడిఎమ్ కె ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి.

No comments: