నేడు నెల్లూరు

Saturday, May 28, 2011

గాలి సోదరులతో వెంకయ్యకు లింక్


భారతీయ జనతాపార్టీలో కర్నాటక రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అందులోను గాలి సోదరులుగా పేరొందిన మైనింగ్ యజమానులకు మంత్రి పదవులు ఇవ్వడంలో ఎవరి బాద్యత ఎంత అన్నదానిపై చర్చ జరుగుతోంది.మన రాష్ట్రానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు ఎమ్.వెంకయ్య నాయుడు వారికి మంత్రి పదవులు రావడంలో ముఖ్య పాత్ర పోషించారని స్వయంగా లోక్ సభ లో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయనతోపాటు అరుణ్ జైట్లి, అనంతకుమార్ లు కూడా కీలక భూమిక పోషించారని ఆమె తెలిపారు. అప్పట్లో అరుణ్ జైట్లి కర్నాటక ఇన్ చార్జీగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. గాలిసోదరులు జనార్దనరెడ్డి, సోమశేఖరరెడ్డి, కరుణాకరరెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఒకే కుటుంబానికి మూడు మంత్రి పదవులు ఇవ్వడమేమిటని తాను ప్రశ్నించానని, కాని అక్కడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా ఇవ్వవలసి వచ్చిందని అన్నారని ఆమె వెల్లడించారు. బళ్లారికి తాను కేవలం ఏడాదికి ఒకసారి వరలక్ష్మి పూజకు మాత్రమే వెళతానని అన్నారు. ఆంగ్ల పత్రిక ఔట్ లుక్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు ఆంద్రప్రదేశ్ కు చెందిన వెంకయ్యనాయుడుకు గాలి సోదరులకు సంబందాలు ఉండగా, గాలి సోదరులకు కాంగ్రెస్ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంతో అప్పట్లో సంబందాలు ఉన్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

No comments: