నేడు నెల్లూరు

Tuesday, May 17, 2011

పవన్ కళ్యాణ్‌పై వదంతులు


సినిమాల్లో ఉన్నవాళ్లకి, రాజకీయాల్లో ఉన్నవాళ్లకి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. సెలబ్రటీస్‌గా , పబ్లిక్ ఫిగర్స్‌ గా ఉన్నవారి వ్యక్తిగత జీవితాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రజలు వీరి గురించి లేనిపోనివి మాట్లాడుకుంటారు కూడా. ఒక్కోసారి లేనిపోనివి మాట్లాడుకుంటుంటారు. మెగాస్టార్ సోదరుడు పవర్‌స్టార్‌గా పేరొందిన పవన్‌కళ్యాణ్‌కు ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. పవన్ కళ్యాణ్-రేణుకాదేశాయ్‌లిద్దరూ విడిపోతున్నారంటూ సినీపరిశ్రమలో ఎవరో వదంతులు సృష్టించారు. ఈ మధ్యకాలంలో రేణుదేశాయ్‌ ఎక్కువగా పూణేలో ఉంటున్నారని, దాంతో వీరిద్దరి మధ్య అంతరాలు వచ్చాయని, విడిపోవడమే ఆలస్యమన్నట్లుగా ప్రచారం చేసేశారు. ఈ వదంతులపై రేణుదేశాయ్‌ తీవ్ర ఆగ్రహాన్ని , అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. తమ బంధం విడిపోనిదని, మరింత బలపడుతుందని ఆమె చెప్తున్నారు. ఇలాంటి వదంతులు చూసి నేను షాక్ అయ్యాను..ఇలాంటివి ఎందుకు పుట్టిస్తారో అర్థం కాదు. మా ఇద్దరి ప్రేమబంధం సుస్థిరమైనదని మీడియాతో రేణుదేశాయ్ చెప్పారు. కొద్దికాలం క్రితం రేణుదేశాయ్‌ లగేజితో సహా పూణె వెళ్లారని, పవన్ మాత్రం హైదరాబాద్‌లో ఉండిపోయారని, దాంతో వీరిమధ్య ఏదో జరిగిందంటూ కొందరు కథలు అల్లారు. అదంతా రబ్బీస్ అని ఆమె కొట్టిపారేస్తూ ఇలాంటి విషయాలేవీ మా పిల్లల చెవిన పడకూడదని జాగ్రత్తలు పడుతున్నట్లు చెప్పారు. బద్రి, జానీ వంటి సినిమాల్లో పవన్‌తో కలిసి నటించిన రేణూ, ఆ తర్వాత ప్రేమలో పడి ఆరేళ్లపాటు సహజీవనం సాగించారు. అది పెద్ద వివాదం కావడంతో పవన్ తన మొదటిభార్య నందినికి పరిహారం చెల్లించి విడాకులు తీసుకొని రేణును 2009లో వివాహమాడారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు. బాబు పేరు అఖిరానందన్, పాప పేరు ఆదియా. పవన్ కళ్యాణ్ పూణెలో ఒక ఇళ్లు కొనుక్కొని అక్కడికి మారినప్పటి నుంచి ఈ వదంతులు మొదలయ్యాయి. జూబ్లిహిల్స్‌లోని ఆయన ఇంటిని పునర్నిర్మాణం కోసం పడేశారు. అందుకే పూణె వెళ్లారు. కేవలం సినిమా షూటింగ్‌లకే హైదరాబాద్ వస్తుంటారు. అయితే బాబు చదువు కోసమే ఆమె పవన్‌తో హైదరాబాద్ రాలేకపోతున్నారని పవన్ ఫ్రెండ్ ఒకాయన చెప్తున్నారు. అంత మాత్రానే విడిపోయినట్లా అని మండిపడుతున్నారు.

No comments: