నేడు నెల్లూరు

Tuesday, May 17, 2011

రజనీకాంత్ కు డయాలిసిస్


ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కు డయాలిసిస్ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.రజనీకాంతో గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురి అయిన సంగతి తెలిసిందే.చెన్నై లోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ కు ఊపిరితిత్తులలో పేరుకున్న నీటిని డాక్టర్లు తొలగించారు. ఊపిరితిత్తులలో ప్లమ్ పేరుకుని ఉండడంతో ఆయన శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారని, దానిని తొలగించడంతో కాస్త ఇబ్బంది తగ్గిందని చెప్పారు.ఇక ఆయన కిడ్నీలను సోమవారం వరకు మందులతోనే నడిపినప్పటికీ, మంగళవారంనాడు డయాలిసిస్ చేయడం మంచిదని బావించి
ఆ మేరకు డయాలిసిస్ కూడా చేశారు.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన మిగిలిన భాగాలు వేటికి ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు. కాగా తమకు తమ అభిమాన నటుడు రజనీకాంత్ ను చూసే అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబునాయుడు, నరేంద్ర మోడి వంటి ప్రముఖులు
మాత్రం రజనీకాంత్ ను పరామర్శించారు.

No comments: