నేడు నెల్లూరు

Saturday, May 28, 2011

మహానాడులో కటౌట్లపై రగడ

మహానాడులో కటౌట్ల వేడి అటు,ఇటు తిరిగి చిన్న నాయకులపై పడింది. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కటౌట్లపై రగడ సృష్టించిన తర్వాత కొంతసేపటికి ఆ వేడిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నాయకులపై చూపారు.చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు తన కుమారుడు లోకేష్‌ను చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించాలని కోరుతూ ఫ్లెక్సీలను ప్రదర్శించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ కు సంబందించి ప్లెక్లీలను ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వి పెట్టారన్నా, లోకేష్ ను కమిటీలోకి తీసుకురావాలన్నా సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మరి చిత్తూరు జిల్లా నాయకులు రెండు రోజులుగా ప్లెక్సీలను ప్రదర్శిస్తే ఇప్పుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటో తెలియదు. బహుశా ఆయనకు ఈ ఫ్లక్లీల గురించి తెలియదా? ఆయన దృష్టికి ఎవరూ తీసుకురాలేదా?హరికృష్ణ గొడవ చేసేవరకు ఆయనకు ఈ విషయం తెలియదా?

No comments: