Monday, May 23, 2011
సత్యసాయికి మహాసమాధి
సత్యసాయిబాబాను పూడ్చిన చోట మహా సమాధి నిర్మించాలని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నిర్ణయించారు. ఈనెల 27నుంచి సత్యసాయిబాబా మహాసమాధి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు రత్నాకర్,ఎస్వీ గిరి సమక్షంలో సాయిబాబా అనువాదకుడు అనిల్కుమార్ ప్రకటించారు. జూలై మొదటివారానికల్లా దీని నిర్మాణం పూర్తి చేస్తామని ఆయనన్నారు. అంతవరకు భక్తులకు ఇప్పుడున్న సమాధిని సందర్శించనివ్వలేమని, దయచేసి సాయిభక్తులంతా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. సత్యసాయి సింహాసనాన్ని సభా మందిరంలో భక్తుల సందర్శనార్థం ఉంచి రోజువారీ భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయితే నిర్మించబోతున్న మహాసమాధి భక్తులకు దివ్యనాభూతి కలిగేలా ఉంటుందని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment