నేడు నెల్లూరు

Monday, May 23, 2011

మహేష్ బాబు భార్య నమ్రతకు టోకరా


ప్రముఖ సినీనటుడు మహేష్ భాబు భార్య నమ్రత శిరోద్కర్ తనను మోసం చేసిన ఒక వ్యాపారిపై కేసు పెట్టారు. జూబ్లి హిల్స్ రోడ్డు నెంబరు 81 లో మహేష్ దంపతులు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ఫర్హద్ బిన్ అలీ వారి ఇంటికి వెళ్లి గ్రిల్స్, గ్లాస్ వర్క్ చేస్తానని, పనికి ఆర్డర్ కోరారు. ఆ మీదట శిరోద్కర్ గ్లాస్ పనికి గాను ఒప్పందం కుదుర్చుకుని 8.5 లక్షల రూపాయల మేర బయానా గా చెల్లించారు. అయితే ఆ తర్వాత ఆ వ్యాపారి పని చేయడానికి చాలా ఆలస్యం చేశారు.కొంత పనిచేసినా అది కూడా సంతృప్తికరంగా సాగలేదు.తదుపరి ఆమె అతని పనిని రద్దు చేసుకుని అయినంతవరకు డబ్బు తీసుకుని మిగిలిన డబ్బు వెనక్కి ఇచ్చివేయాల్సిందిగా కోరారు. అందుకు ఆ వ్యాపారి కూడా అంగీకరించి ,అయిన ఖర్చు పోను 4.63 లక్షల రూపాయల మేర చెక్ జారీ చేశారు.కాని ఆ తర్వాత చెక్కు చెల్లలేదు.మరోసారి ఆ వ్యాపారిని హెచ్చరిస్తే ఇంకో చెక్కు ఇచ్చినా అది కూడా చెల్లలేదు.దాంతో ఆమె కోర్టులో కేసు వేయగా వారి ఆదేశం మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments: