నేడు నెల్లూరు

Monday, May 16, 2011

జయలలితకు ఇష్టమైన నెంబర్‌




మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు బాగా అధికంగా ఉండే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి గా జయలలిత తన నమ్మకాలకు అనుగుణంగానే ప్రమాణస్వీకారం చేశారు.ఆమె తన స్టైల్‌లోనే మంత్రులతో కలిసి కూర్చున్నారు. అంత పెద్ద సీనియర్ మంత్రులు సైతం ఆమెకు కాస్త దూరంగా, చాలా వినయంగా కూర్చుని కన్పించారు. జయలలిత సీటుకు అటు ఇటూ కనీసం 2, 3 అడుగుల గ్యాప్ వరకు ఎవరూ కూర్చోలేదు.మాజీ ముఖ్యమంత్రి అయిన పన్నీర్‌సెల్వం జయలలితతో మాట్లాడటానికి లేచినపుడు ఆ సన్నివేశం చూస్తే వారికి జయలలిత పట్ల గౌరవమో, భయమో అర్థం కాని పరిస్థితిలో కన్పించారు. ఇక ఆమె నమ్మకాలను చూస్తే సరిగ్గా 12.15నిముషాలకు మద్రాస్ వర్శిటీలోని సెంటినరీ హాల్‌లోకి ప్రవేశించారు. ఎందుకంటే ఆమెకు 9 నెంబర్‌పై ఆపార నమ్మకం. 12.15అంకెలన్నీ కలిపితే తొమ్మిది అవుతుంది. అందుకే ఆ టైంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.వంకాయరంగు చీర ధరించి వచ్చిన జయలలిత మొత్తం 33మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో 24మంది కొత్తవారు కావడం విశేషం. ఇక ఆమె ఇంటినెంబర్ కూడా 36కావడం (మూడుఆరు కలిపితే తొమ్మిది)మరో విశేషం.వీల్ చైర్‌లో వచ్చిన గవర్నర్ సూర్జిత్‌సింగ్ బర్నాలాను సాదరంగా జయలలిత ఆహ్వానించి తన మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు. జాతీయగీతం తరువాత తమిళగీతం ఆలపించిన జయలలిత తమిళంలోనే ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఈమె విజయంలో మిక్సీలు,గ్రైండర్లతో పాటు కీలకపాత్ర పోషించాయని తమిళవిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments: