నేడు నెల్లూరు

Monday, May 23, 2011

తీహారు జైలులో కరుణానిధి


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తన ముద్దుల కుమార్తె కనిమొళిని తీహారు జైలులో కలుసుకుని పరామర్శించారు. కనిమొళి అరెస్టుపై ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అన్యాయంగా అరెస్టు చేశారని కరుణానిది వాపోతున్నారు. కరుణానిది, కనిమొళి కలిసినప్పుడు వారిద్దరి మద్య సహజంగానే విచారం పెల్లుబుకుతుంది.పట్టుపరుపులపై, హంసతూలికాతల్పం వంటి మంచాలపై విశ్రాంతి తీసుకునే తన కుమార్తె జైలులో కటిక ప్రదేశంలో పడుకోవలసి రావడం కరుణానిది ఊహించని విషయం. పైగా కనిమొళి జైలులో తొలి రోజు సరిగా నిద్ర పోలేకపోయింది. దోమల బాధ, సరైన టాయిలెట్ సదుపాయం లేకపోవడం వంటి బాధలు ఆమెను ఇబ్బందులకు గురి చేశాయి. కాగా కనిమొళిని తన సాహిత్య వారసురాలుగా కరుణానిధి గతంలో ప్రకటించారు. ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా చేశారు. ఆమె కలైంగర్ టివీ ఛానల్ పెడితే సంతోషించారు. అలాంటి కనిమొళి తీహారు జైలు నాలుగు గోడల మధ్య మగ్గడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఎనబైఎనిమిది సంవత్సరాల వయసులో కరుణానిధికి ఇది మానసికంగా పెద్ద దెబ్బే.కరుణానిధితో పాటు తల్లి రజతి అమ్మాళ్, భర్త
అరవిందన్ కూడా కనిమొళిని కలిశారు.

No comments: