నేడు నెల్లూరు

Sunday, May 2, 2010

వర్గపోరు సమసేనా..?

జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య చుట్టూ పరిభ్రమిస్తోంది. బహిరంగంగా నాయకులు పోటీపడి నగరంలో వేర్వేరుగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి, పొదలకూరు రోడ్ల ఇరువైపుల ఫ్లెక్సీ బ్యానర్లతో నిండిపోయాయి. రెండు రోజులు నెల్లూరులో గడుపు తున్న సీఎం ఒకేఒక అధికారిక కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటున్నారు. మి గిలిన కార్యక్రమాలన్నీ ప్రైవేటువే. పలువురు నేతల ఇళ్ళల్లో అడుగుపెట్టే సీఎం ఉదయం ఒకరింట అల్పాహారం, మధ్యాహ్నం మరొకరి ఇంట భో జనం, ఇలా రెండు రోజులు నాయకులతో గడపను న్నారు.

ఎవరికి వారుగా...
జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పనబాకలక్ష్మి ఇప్పటికే పలుసార్లు సోనియాని కలిసి నేదురు మల్లిపై ఫిర్యాదు చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో విభేదించిన జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వేరుగా ఉంటున్నారు. ఇలా జిల్లా అగ్రనేతలు ఎవరికి వారుగా ఉండడంతో రోజురో జుకు కాంగ్రెస్ వర్గపోరు శృతిమించుతోంది.

మరో కొన్నిగంటల్లో సీఎం జిల్లాలో అడుగు పెట్టనున్న నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మంత్రి ఆనంపై విమర్శలు సంధించా రు. నేదురుమల్లిని కలిసి మంత్రి ఆనం వ్యవహారం శైలివల్ల పార్టీ నష్టపో తుందని ఆరోపించారు. కాస్తా ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని పరో క్షంగా ఆనం మంత్రి పదవిని తప్పిస్తా మనే సంకేతాన్ని ఇచ్చారు. కార్యకర్తల కు భరోసా ఇస్తూ కాంగ్రెస్ కార్యక ర్తలకు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ సీఎంగా ఉండగా ఆనం మాట బాగా చెల్లుబాటు ఆయ్యే ది. రోశయ్య సీఎం కావడంతో నేదురు మల్లికి ప్రాధాన్యం పెరిగింది.

జిల్లాలో ముఖ్య అధికారుల నియామకంలో నేదురుమల్లి సూ చనలు పాటిస్తు న్నారనే ప్రచారం ఉంది. తొలుత నే దురుమల్లి, ఆనం ఇళ్ళకు మాత్రమే సీఎం వెళ్తారనే సమా చారం అందింది. ఇది జీర్ణించుకోలేని కొందరు నాయకులు తమ ఇళ్ళకు రావాల్సిందేనని సీఎంపై ఒత్తిళ్ళు తెచ్చినట్లు తెలిసింది. శనివారం సాయంత్రం నేదురుమల్లి విలేఖ రులతో మాట్లాడుతూ నాయకులు ఇళ్ళకు సీఎం వెళ్ళడంపై ప్రస్తావిస్తూ కొంత వ్యంగ్యంగా మాట్లాడారు.

ఈ నే పథ్యంలో జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న రోశయ్య పార్టీకి కాయకల్ప చికిత్స చేపట్టకపోతే రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో సష్టపోవలసి వస్తుందని కార్యకర్తలు మదన పడుతున్నారు. రెండు రోజులుగా నెల్లూరు ఉంటున్న ఆయన పార్టీ స్ధితిగతులపై నాయకుల తో చర్చించి అందరిని ఒక తాటిపై నడపాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంటున్నా రు. మరి రోశయ్య ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.

No comments: