నేడు నెల్లూరు

Tuesday, May 4, 2010

నగర రోడ్లకు మహర్ధశ

నెల్లూరు నగరరోడ్లకు మహర్దశ పట్ట నుంది. పలు ప్రధాన రహదారులతో పాటు డివిజన్లలోని రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయనున్నారు. దాదాపు రూ. 30 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. జాతీయ రహదారి నుంచి నగరంలోకి వచ్చే రోడ్లను కూ డా అభివృద్ధి పరచనున్నారు. దీంతో నగరవాసుల కష్టాలు కొంతమేరకు గట్టెక్కనున్నాయి.

జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. 2001లో మూడు లక్షలు జనాభా ఉండగా, ప్రస్తుతం ఐదు లక్షలకుపైగా పెరిగింది. అలాగే 2005 వరకు 66 చదరపుకిలోమీటర్ల వైశాల్యం ఉన్న నగరం, జనాభా పెరిగి శివారు ప్రాంతాలు ఏర్పడుతుం డడంతో 75 చ.కి.మీటర్లకు విస్తరించిం ది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లు అభివృద్ధి చెందలేదు.

దీంతో పలు ప్రధాన రహదారులతో పాటు డి విజన్లలోని రోడ్ల అధ్వానంగా ఉన్నా యి. నేటికీ వర్షం కురిస్తే కాలు పెట్ట లేని దుస్థితి ఉంది. రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి ప్రత్యేక చొరవతో నగర రోడ్ల పరి స్థితులు మారనున్నాయి. నిన్నమొన్న టి వరకు నడిచేందుకు వీలు లేకుండా ఉంటున్న రోడ్లు సైతం సిమెంట్‌రోడ్లు గా అభివృద్ది చెందనున్నాయి. అలాగే జాతీయరహదారి లింకు రోడ్లు అభివృ ద్ధి చెందనున్నాయి.

లింకురోడ్ల అభివృద్ధికి రూ. 18.5 కోట్లు
జాతీయ రహదారి నుంచి నగరంలోకి వచ్చే లింకు రోడ్లు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 18.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో మినీబైపాస్ నుంచి పడారుపల్లి మెయిన్‌రోడ్డు కొండాయపాళెం రైల్వే గేటు నుంచి పాతకొండాయపాళెం వనంతోపుల మీదుగా జాతీయ రహ దారి రోడ్డు-మైపాడు మెయిన్ రోడ్డు నుంచి పద్మావతినగర్ మీదుగా జాతీయ రహదారి రోడ్డు, మినీబైపాస్ కొండాయపాళెం రోడ్డు నుంచి ఆర్టీవో కార్యాలయం రోడ్డులను తారురోడ్డు లుగా అభివృద్ధిపరచనున్నారు.

జాతీ య రహదారి నుంచి చ్రిల్డన్స్ పార్కు రోడ్డు, విజయమహల్ గేటు నుంచి మూడు సినిమాహాళ్ళ మీదుగా ము త్తుకూరు బస్టాండ్ వరకు సిమెంట్ రో డ్లును ఏర్పాటు చేయనున్నారు. ఇం దుకు సంబంధించి టెండర్లను కూడా ఆహ్వానించారు.

రూ.10 కోట్లతో డివిజన్ల రోడ్లు
కార్పొరేషన్ నిధులు రూ.10 కోట్లతో నగరంలోని 50 డివిజన్లలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పర చనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని పనులకు టెండర్లు పూర్తి కావ డంతో పలు డివిజన్‌లలో పనులు జరు గుతున్నాయి. మరికొన్ని పనులకు టెం డర్లను పిలవాల్సి ఉంది. నగర పాలక సంస్థ జనరల్ నిధులతో పైశివారు ప్రాంతాల డివిజన్‌లకు రూ.20 లక్షలు, ఇంటర్నర్ డివిజన్‌కు రూ.10 లక్షలు చొప్పున పనులు కేటాయించారు.

అయితే కొంత మంది కార్పొరేటర్లు ఒక్క డివిజన్‌కు రూ.30 నుంచి రూ. 40 లక్షలు మేర పనులను కేటాయింప చేసుకున్నారు. ఈ నిధులతో డివిజన్ లో సిమెంట్ రోడ్లతో పాటు కాలువలు, కల్వర్టులు అభివృద్ధి పరుస్తున్నారు.

రూ.రెండుకోట్లతో విస్తరణ పనులు
నగరంలోని అయ్యప్పగుడి నుంచి ఆర్టీసీ వరకు రోడ్లు భవనాల శాఖ ఆ ధ్వర్యంలో రెండు కోట్లతో రోడ్డు విస్త రణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంత రోడ్లు అభివృద్ధి చెందుతా యి. మొత్తం మీద పనులన్ని పూర్తి అయితే ఏడాదిలోపు నగర రోడ్లు అధిక భాగం అభివృద్ధి చెందను న్నాయి.

No comments: